Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వికారాబాద్‌లో విద్యార్థినిని కారులో అత్యాచారం అత్యాచారం

Advertiesment
rape demo
, బుధవారం, 22 ఫిబ్రవరి 2023 (14:14 IST)
తెలంగాణ రాష్ట్రంలో నిత్యంతో ఏదో ఒక ప్రాంతంలో అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా వికారాబాద్ జిల్లాలో ఓ విద్యార్థినిపై అత్యాచార జరిగింది. పదో తరగతి చదువుతున్న ఓ బాలికపై రఘుపతి అనే యువకుడు కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్పడ్డాడు. 
 
పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు విహారయాత్ర కోసం పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వెంకటయ్య కొందరు విద్యార్థులను హైదరాబాద్ నగరానికి తీసుకొచ్చాడు. విహార యాత్ర ముగిసిన తర్వాత తిరిగి అర్థరాత్రి సమయంలో స్కూలుకు చేరుకున్నారు. ఆ సమయంలో ఆ విద్యార్థినిని ఇంటికి తీసుకెళ్లేందుకు ఆమె తల్లిదండ్రులు రాలేదు. దీంతో ఆ విద్యార్థిని రఘుపతికి అప్పగించి, ఆమెను ఇంటివద్ద దింపాలంటూ హెచ్ఎం సూచించాడు. 
 
ఇదే అదునుగా భావించిన రఘుపతి.. బాలికను కారులో ఎక్కించుకుని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్ళి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత ఇంటికి తీసుకెళ్లి వదిలిపెట్టాడు. ఈ విషయాన్ని బాధిత బాలిక రెండు రోజుల తర్వాత తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో వారు యాలాల పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు రఘుపతిని అరెస్టు చేశారు. అలాగే, నిర్లక్ష్యంగా వ్యవహరించిన పాఠశాల హెడ్మాస్టర్‌ వెంకటయ్యను కూడా జిల్లా కలెక్టర్ సస్పెండ్ చేశాడు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

విషపూరిత ఇంజెక్షన్ వేసుకుని వరంగల్ ఎంజీఎం వైద్యురాలు సూసైడ్ అటెంప్ట్