Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

గాంధీ తిరిగిన గడ్డ అత్యాచారాల కేంద్రంగా మారింది : బాలీవుడ్ హాట్ బాంబ్

బాలీవుడ్ హాట్‌బాంబ్‌గా పేరుగడించిన, పలు వివాదాస్పదాలకు కేంద్ర బిందువుగా ఉండే బాలీవుడ్ నటి మల్లికా షెరావత్. ఆమె తాజాగా చేసిన వ్యాఖ్యలు ఇపుడు సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. గాంధీజీ తిరిగిన ఈ

గాంధీ తిరిగిన గడ్డ అత్యాచారాల కేంద్రంగా మారింది : బాలీవుడ్ హాట్ బాంబ్
, శుక్రవారం, 27 ఏప్రియల్ 2018 (15:15 IST)
బాలీవుడ్ హాట్‌బాంబ్‌గా పేరుగడించిన, పలు వివాదాస్పదాలకు కేంద్ర బిందువుగా ఉండే బాలీవుడ్ నటి మల్లికా షెరావత్. ఆమె తాజాగా చేసిన వ్యాఖ్యలు ఇపుడు సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. గాంధీజీ తిరిగిన ఈ భార‌త‌దేశం ఇప్పుడు అత్యాచారాల‌కి అడ్డాగా మారింది.
 
ఈ టైంలో ప్ర‌జ‌లంద‌రు మీడియాపైనే ఆశ‌లు పెట్టుకున్నారు. క‌థువా, ఉన్నావ్ లాంటి సంఘ‌ట‌న‌లు మీడియా లేక‌పోతే బ‌య‌ట‌కి వచ్చేవే కావు. మీడియా ఒత్తిడి వ‌ల‌నే మైన‌ర్ల‌పై అత్యాచారం ఒడిగట్టేవారికి ఉరిశిక్ష విధించాల‌న్న కొత్త చ‌ట్టం ఉంది. ఈ విష‌యంలో ఏం చేయాల‌న్న అది మీడియాకి మాత్ర‌మే సాధ్యం అని మ‌ల్లికా అన్నారు. 
 
ఆమె ''దాస్ దేవ్" చిత్రాన్ని గురువారం రాత్రి ముంబైలోని అంథేరి మ‌ల్టీప్లెక్స్‌లో స్పెష‌ల్ స్క్రీనింగ్ వేయగా, ఈ షోకు హాజ‌రైన మ‌ల్లిక సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. దేశంలో పిల్ల‌లు, మ‌హిళ‌ల ప‌ట్ల జ‌రుగుతున్న అఘాయిత్యాలు దారుణమన్నారు. ఇప్ప‌టికే బాలీవుడ్ సినీ సెల‌బ్రిటీలు జమ్ముకాశ్మీర్‌లోని కథువా, ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఉన్నావ్‌లో జరిగిన అత్యాచార ఘటనలని ఖండిస్తూ నిర‌స‌న‌లు చేప‌ట్టిన సంగ‌తి తెలిసిందే. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సోడాలు, ఐస్‌క్రీములు అమ్మిన ''రంగస్థలం'' హీరో