Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఎక్కువ ఓట్లు వచ్చినా ఎలిమినేట్ చేస్తారా? బిగ్ బాస్-2పై మాధవీ లత ఫైర్

తెలుగు బిగ్‌బాస్-2 షోపై నటి మాధవీలత సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. నూతన్ నాయుడు ఎలిమినేషన్‌పై మాధవీలత మండిపడింది. ట్విట్టర్ ద్వారా బిగ్ బాస్ సీజన్‌-2పై ఫైర్ అయ్యింది. నూతన్ నాయుడు ఎలిమినేషన్‌తో ప్రేక్ష

Advertiesment
Madhavi Latha
, మంగళవారం, 4 సెప్టెంబరు 2018 (10:30 IST)
తెలుగు బిగ్‌బాస్-2 షోపై నటి మాధవీలత సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. నూతన్ నాయుడు ఎలిమినేషన్‌పై మాధవీలత మండిపడింది. ట్విట్టర్ ద్వారా బిగ్ బాస్ సీజన్‌-2పై ఫైర్ అయ్యింది. నూతన్ నాయుడు ఎలిమినేషన్‌తో ప్రేక్షకుల ఓట్లకు విలువ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేసింది. అమిత్ కంటే నూతన్‌కు ఎక్కువ ఓట్లు వచ్చినా అతడిని ఎలిమినేట్ చేయడం దారుణమని మాధవీలత పేర్కొంది. 
 
రీ ఎంట్రీ ఇవ్వడంతోనే నూతన్‌ను బయటకు పంపించారని మాధవీలత ఆరోపణలు చేసింది. నూతన్ నాయుడు ఎలిమినేషన్‌తో ఇకపై ప్రేక్షకుల ఓట్లకు పెద్దగా విలువ ఉండదని అర్థమైందని తెలిపింది. కేవలం షోను చూసి ఆనందించడానికే పరిమితం కావాలని మాధవీలత సూచించింది.
 
కాగా, బిగ్‌బాస్‌ హౌస్ నుంచి ఇద్దరు ఎలిమినేట్ అయ్యారు. సామాన్యుడి కోటాలో హౌస్‌లోకి వచ్చిన గణేశ్ శనివారం ఎలిమినేట్ కాగా, ఆదివారం నూతన్ నాయుడు ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే.
 
సామాన్యుడి కోటాలో హౌస్‌లో అడుగుపెట్టిన గణేశ్, నూతన్ నాయుడులలో నూతన్ ఓసారి ఎలిమినేట్ అయి, రీ ఎంట్రీ ఇవ్వగా, గణేశ్ సెలబ్రిటీలకు ధీటుగా 84 రోజులు హౌస్‌లో ఉండి సత్తా చాటాడు. కానీ సామాన్యుడి హోదాలో నూతన్ హౌస్ నుంచి వెలుపలికి వచ్చేయడంతో ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్‌లో కేవలం సెలెబ్రిటీలు మాత్రమే వున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎలిమినేషన్స్‌లో ఆ నలుగురు... ఏమైనా జరగొచ్చు కదా ''బిగ్ బాస్''