Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

''క్రాక్''కు షాక్ మార్నింగ్ షో రద్దు..

''క్రాక్''కు షాక్ మార్నింగ్ షో రద్దు..
, శనివారం, 9 జనవరి 2021 (10:35 IST)
మాస్‌ మహారాజ్‌ రవితేజ, శ్రుతీహాసన్‌ జంటగా గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'క్రాక్‌'. సరస్వతి ఫిలిమ్స్‌ డివిజన్‌ బ్యానర్‌పై బి. మధు నిర్మించిన ఈ సినిమా విడుదల కాబోతోంది. అభిమానులంతా ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తూ ఉన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ దాదాపు 1000 థియేటర్లలో ప్రదర్శించబడేందుకు సిద్ధంగా ఉన్న తరుణంలో ఒక్కసారిగా అభిమానులకు బ్యాడ్ న్యూస్ వచ్చింది.
 
సాధారణంగా భారతదేశంలో విడుదలవ్వడానికంటే ముందే అమెరికాలో ప్రీమియర్ షోలు పడుతూ ఉంటాయి. మన తెలుసు సినిమాలకు ప్రీమియర్ షోల టాక్ చాలా ముఖ్యం. కానీ ఎందుకో ప్రీమియర్ షోలు పడలేదు. శుక్రవారం రాత్రి, జనవరి 8వ తేదీన అమెరికాలో ప్రీమియర్స్ షోలు రద్దు అయ్యాయి. షో రద్దు అయిందని, డబ్బులు రిఫండ్ చేస్తామని తమకు వచ్చిన మెసేజ్‌ల స్క్రీన్ షాట్లను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. 
 
ఇక తెలుగు రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లో 'క్రాక్' మార్నింగ్ షో రద్దు అయింది. దీంతో సోషల్ మీడియాలో ఈరోజు సినిమా విడుదల అవుతుందా లేదా అనే డౌట్స్ వచ్చాయి. అయితే ప్రస్తుతం ఫైనాన్సియల్ క్లియరెన్స్ అయిపోయిందని, 9 గంటల నుంచి తెలుగు రాష్ట్రాల్లో షోలు పడతాయని 'క్రాక్' పీఆర్ టీమ్ క్లారిటీ ఇవ్వడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మరోసారి అదరగొట్టిన క్రాక్ రవితేజ, పాజిటివ్ రిపోర్ట్స్