Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

దివ్యభారతి మరణానికి ముందు ఎవరిని కలిసిందో తెలుసా...

దివ్యభారతి మరణానికి ముందు ఎవరిని కలిసిందో తెలుసా...
, మంగళవారం, 26 ఫిబ్రవరి 2019 (15:10 IST)
చిన్న వయస్సులోనే గ్లామరస్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న నటి దివ్య భారతి. అతి తక్కువ కాలంలోనే ఎంతో క్రేజ్ తెచ్చుకుంది. మూడు భాషలలో అగ్రహీరోల సరసన నటించింది. అలాంటి నటి దురదృష్టవశాత్తు అతిపిన్న వయస్సులోనే ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయింది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 25వ తేదీన ఆమె జన్మదినం సందర్భంగా జాతీయ మీడియాలో ఆమెపై ప్రచురితమైన కథనం ఆసక్తికరంగా ఉంది.
 
ఆ కథనం మేరకు... చెన్నైలో షూటింగ్ పూర్తి చేసుకుని, ముంబై వెళ్లి అక్కడ చేయాల్సి ఉన్న మరో షూటింగ్‌ను రద్దు చేసుకుని తన ఇంటికి వెళ్లింది. డిజైనర్ నీతా లుల్లా నుండి ఫోన్ కాల్ రావడంతో 'ఆందోళన్' సినిమా కోసం తన దుస్తుల డిజైనింగ్ గురించి మాట్లాడటానికి ఆమెను ఇంటికి ఆహ్వానించగా, తన భర్తతో కలిసి వచ్చిందని కథనంలో పేర్కొన్నారు. 
 
నీతా, ఆమె భర్త, దివ్యభారతి కలిసి మందు కొడుతుండగా, పనిమనిషి స్నాక్స్ ప్రిపేర్ చేస్తున్నారు. ఆ సమయంలో నీతా దంపతులు టీవీ చూస్తుండగా, దివ్య బాల్కనీ పిట్టగోడ చివరన కూర్చుంది. అక్కడ పట్టుతప్పి ఐదు అంతస్తులపై నుండి కింద పడిపోయింది. ఆ తర్వాత హాస్పిటల్‌కు తీస్తుని వెళ్లగా చికిత్స పొందుతూ మృతి చెందింది.
 
దివ్యభారతి మరణంపై అనేక అనుమానాలు ప్రచారంలో ఉన్నాయి. దివ్యభారతి తండ్రి ఓం భారతి ఓ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మరణంపై తనకు ఎలాంటి అనుమానాలు లేవన్నారు. ఇంకా దివ్యభారతి డిప్రెషన్‌కు లోనుకాలేదని, ఎలాంటి సమస్యనైనా కూల్‌గా పరిష్కరించుకునే సామర్థ్యం తనకుందని, ప్రమాదవశాత్తూ ఈ ఘటన జరిగిందని వెల్లడించారు. తన మరణం ఎప్పటికీ తీరని లోటు అని బాధపడ్డారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కౌషల్‌కు డబ్బు పిచ్చి...మీడియా ముందుకు కౌషల్ ఆర్మీ