Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

చెర్రీకి అన్నయ్యగా ప్రశాంత్.. మరి స్నేహ జోడీగా నటిస్తుందా?

రామ్‌చరణ్, బోయపాటి శీను కాంబినేషన్‌లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. ఈ చిత్రంలో బలమైన విలన్‌గా వివేక్ ఒబెరాయ్ కనిపించనుండగా, హీరోయిన్‌గా కైరా ద్వానీ నటిస్తోంది. కీలక పాత్రలో స్నేహ నటించనుంది. ఈ నేపథ్

చెర్రీకి అన్నయ్యగా ప్రశాంత్.. మరి స్నేహ జోడీగా నటిస్తుందా?
, శనివారం, 20 జనవరి 2018 (16:27 IST)
రామ్‌చరణ్, బోయపాటి శీను కాంబినేషన్‌లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. ఈ చిత్రంలో బలమైన విలన్‌గా వివేక్ ఒబెరాయ్ కనిపించనుండగా, హీరోయిన్‌గా కైరా ద్వానీ నటిస్తోంది. కీలక పాత్రలో స్నేహ నటించనుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రలో తమిళ సీనియర్ హీరో ప్రశాంత్ నటించనున్నట్టు ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. 
 
శంకర్ దర్శకత్వంలోని 'జీన్స్' సినిమాతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న ప్రశాంత్, ఆ తర్వాత ఆశించిన స్థాయిలో అవకాశాలను అందిపుచ్చుకోలేకపోయాడు. ప్రస్తుతం ప్రశాంత్ చెర్రీ సినిమాలో కనిపించనున్నాడు. ఇందులో ప్రశాంత్ చెర్రీకి అన్నయ్యగా నటిస్తాడని సమాచారం. ఇక స్నేహ ప్రశాంత్ సరసన నటిస్తుందని టాక్. శ్రీమతి డి.పార్వతి సమర్పణలో డి.వి.వి.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ఎల్‌.ఎల్‌.పి బ్యానర్‌పై దానయ్య డి.వి.వి భారీ బడ్జెట్‌ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 
 
రామ్‌చరణ్‌, కైరా అద్వాని, ప్రశాంత్‌, వివేక్‌ ఒబెరాయ్‌, స్నేహ, హిమజ, ప్రవీణ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు: ఎం.రత్నం, స్టిల్స్: జీవన్, ఎడిటర్‌: కోటగిరి వెంకటేశ్వర రావు, ఆర్ట్‌: ఎ.ఎస్‌.ప్రకాష్‌, సంగీతం: దేవిశ్రీప్రసాద్‌, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: బోయపాటి శ్రీను.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆచారి అమెరికా యాత్ర టీజర్ వైరల్.. రిపబ్లిక్ డేకి విడుదల