Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

"అన్నమయ్య" చిత్ర నిర్మాత ఇకలేరు...

, సోమవారం, 18 జనవరి 2021 (08:56 IST)
హీరో అక్కినేని నాగార్జునతో అన్నమయ్య వంటి హిట్ చిత్రాన్ని నిర్మించిన నిర్మాత వి.దొరస్వామిరాజు ఇకలేరు. ఆయన సోమవారం ఉదయం కన్నుమూశారు. వీఎంసీ ప్రొడక్షన్ అనే నిర్మాణ సంస్థపై ఆయన అనేక చిత్రాలు నిర్మించారు. 
 
గత కొంతకాలం నుంచి వయో భారంతో దొరస్వామిరాజు ఆరోగ్యం క్షీణించింది. అనారోగ్యంతో ఆయన బంజారా హిల్స్‌ కేర్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు. ఈయన నిర్మాణ సంస్థపై సీతారామయ్యగారి మనవరాలు, ప్రెసిడెంట్‌గారి పెళ్ల్లాం, కిరాయిదాదా, అన్నమయ్య, సింహాద్రి, వెంగమాంబ, భలే పెళ్లాం వంటి సినిమాలను ఆయన నిర్మించారు. 
 
వి.ఎం.సి(విజయ మల్లీశ్వరి కంబైన్స్‌) పేరు మీద సినీ డిస్ట్రిబ్యూషన్‌ ఆఫీసును ప్రారంభించి ఎన్నో సక్సెస్‌ఫుల్ చిత్రాలను డిస్ట్రిబ్యూట్ చేసి సీడెడ్‌లో ప్రముఖ డిస్ట్రిబ్యూటర్‌గా ఈయన పేరు పొందారు. 1994లో నగరి నియోజక వర్గం నుండి ఎమ్మెల్యేగా గెలుపొందారు.
 
తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యుడుగా, ఫిలిం ఛాంబర్‌ ప్రెసిడెంట్‌, డిస్ట్రిబ్యూషన్‌ అండ్‌ కౌన్సిల్‌ ప్రెసిడెంట్‌, ఎగ్జిబిటర్స్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ ఇలా ఎన్నో పదవులను అలంకరించారు. కొంతకాలంగా నిర్మాణ రంగానికి దూరంగా ఉన్న దొరస్వామిరాజు మరణం సినీ పరిశ్రమకు తీరని లోటుగా చెప్పవచ్చు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

"ఇన్ ద మార్నింగ్" కోసం దిగంబరంగా మారిన జెన్నిఫర్ లోఫెజ్