Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కరోనా కాటు, రైల్వే శాఖ సహాయమంత్రి సురేష్ ఆంగడి కన్నుమూత

Advertiesment
union minister
, బుధవారం, 23 సెప్టెంబరు 2020 (21:58 IST)
న్యూఢిల్లీ: కరోనావైరస్ (కోవిడ్ -19) సోకి ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న రైల్వే శాఖ సహాయ మంత్రి సురేష్ ఆంగడి కన్నుమూశారు. బుధవారం రాత్రి ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించింది. వైద్యులు చేసిన ప్రయత్నాలు విఫలమవడంతో ఆయన కన్నుమూశారు.
 
ఆయనకు కరోనాపాజిటివ్ రావడంతో ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేర్చి చికిత్స అందిస్తూ వస్తున్నారు. కాగా రైల్వే శాఖ సహాయమంత్రి ఆంగడి అకాల మరణం పట్ల ప్రధాని నరేంద్ర మోడీ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలంటూ ట్వీట్ చేసి నివాళులర్పించారు.
 
'సురేష్ ఆంగడి అంకితభావంతో ఉన్న ఎంపీ, సమర్థ మంత్రి. కర్ణాటకలో పార్టీని బలోపేతం చేయడంలో ఆయన ఎంతో కృషి చేశారు. అతని మరణం విచారకరం.' అని ట్వీట్ చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అక్టోబర్ 2 నుంచి 'మనం-మన పరిశుభ్రత' రెండోదశ: ప్రజాప్రతినిధులకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లేఖ