Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రూ.కోట్లు ఇచ్చా.. ప్లీజ్ నాపేరు చెడగొట్టొద్దు... బ్రాడ్ పిట్

తన మాజీ భార్య ఏంజెలినా జోలీకి హాలీవుడ్ నటుడు బ్రాట్ పిట్ ఓ విజ్ఞప్తి చేశాడు. పిల్లల సంరక్షణార్ధం ఇప్పటికే రూ.61 కోట్లు ఇచ్చాననీ, డబ్బు ఇవ్వలేదనీ కోర్టుకెక్కి తన పేరు చెడగొట్టొద్దంటూ ప్రాధేయపడ్డాడు.

రూ.కోట్లు ఇచ్చా.. ప్లీజ్ నాపేరు చెడగొట్టొద్దు... బ్రాడ్ పిట్
, శుక్రవారం, 10 ఆగస్టు 2018 (10:33 IST)
తన మాజీ భార్య ఏంజెలినా జోలీకి హాలీవుడ్ నటుడు బ్రాట్ పిట్ ఓ విజ్ఞప్తి చేశాడు. పిల్లల సంరక్షణార్ధం ఇప్పటికే రూ.61 కోట్లు ఇచ్చాననీ, డబ్బు ఇవ్వలేదనీ కోర్టుకెక్కి తన పేరు చెడగొట్టొద్దంటూ ప్రాధేయపడ్డాడు.
 
హాలీవుడ్ సెలబ్రిటీ జంట ఏంజెలినా జోలీ, బ్రాడ్ పిట్‌లు సుమారుగా 11 యేళ్ళ పాటు సహజీవనం చేయగా, వీరికి నలుగురు పిల్లలు. మరో ఇద్దరు పిల్లలను దత్తత తీసుకున్నారు. దీంతో మొత్తం ఆరుగురు పిల్లలు. 
 
అయితే, వీరిద్దరూ 2016 సెప్టెంబరులో విడిపోయారు. అపుడు తాగుడుకు బానిసైన పిట్.. పిల్లల్ని కొట్టడంతో ఏంజెలినా విడాకులు తీసుకుంది. ఈ సందర్భంగా కోర్టు ఆరుగురు పిల్లల సంరక్షణను ఏంజెలినాకే అప్పగించింది. 
 
ఆ సమయంలో కుటుంబ పోషణ, పిల్లల సంరక్షణ కోసం బ్రాడ్ పిట్ రూ.61 కోట్లు ఇచ్చాడట. కానీ, ఏంజెలినా జోలీ మాత్రం మరోలా ఆరోపిస్తోంది. తనకు తగినంత నగదు ఇవ్వలేదని తాజాగా కోర్టును ఆశ్రయించింది. 
 
దీనిపై పిట్ స్పందించాడు. విడాకుల సమయంలో జోలీకి రూ.61 కోట్లు(9 మిలియన్ డాలర్లు) ఇచ్చానని చెప్పాడు. తన పేరు చెడగొట్టేందుకే జోలీ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తోందని ఆవేదన వ్యక్తంచేశాడు. కాగా, చిన్నారులను తనకూ జాయింట్ కస్టడీకి ఇవ్వాలని పిట్ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలుచేశాడు. దాదాపు 11 ఏళ్ల పాటు ఈ జంట సహజీవనం చేసింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గోరక్షణ పేరుతో దాడులా? ఇడియట్సే ఆ పని చేస్తారు : కంగనా రనౌత్