Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

లోబోను చాలా మిస్ అవుతున్నాను.. ఉమాదేవి ఎమోషనల్...

లోబోను చాలా మిస్ అవుతున్నాను.. ఉమాదేవి ఎమోషనల్...
, మంగళవారం, 21 సెప్టెంబరు 2021 (18:17 IST)
Umadevi
బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ బుల్లితెర ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుంటుంది. ఇందులో అర్థపావు భాగ్యంగా అలరించే ఉమాదేవి మొత్తానికి బిగ్ బాస్ సీజన్ 5లో అవకాశం అందుకుంది. కానీ బిగ్ బాస్ హౌస్ నుంచి అతి తక్కువ సమయంలోనే ఇంటి దారి పట్టింది. 
 
తాజాగా సోషల్ మీడియా లైవ్‌లో ఉమాదేవి మాట్లాడుతూ.. అందరి లవ్ సపోర్ట్ వల్లే ఇంత వరకు వచ్చాను అంటూ.. బిగ్ బాస్ షో నుంచి మంచి పేరుతో బయటకు రావడం సంతోషంగా ఉందని కానీ రెండో వారంలోనే బయటికి రావడం బాధగా ఉందని తెలిపింది. అందులోనే ఉంటే మాత్రం ఇంకా ఎక్కువగా ఎంటర్టైన్ చేసేదాన్ని అని తెలిపింది. ఇక తనకు ఎలిమినేషన్ అనేది అన్ ఫెయిర్‌గా అనిపించిందని ఆ విషయంలో చాలా బాధపడ్డానని తెలిపింది. 
 
ఏం జరిగినా అంత మంచిదే అనుకొని ఒకవేళ మళ్లీ రీ ఎంట్రీ అవకాశం వస్తే ఖచ్చితంగా వెళ్తాను మిమ్మల్ని మరింత ఎంటర్టైన్ చేస్తాను అని తెలిపింది. ఇక తను ఏ విషయంలోనైనా ముక్కుసూటిగా ఉంటానని కానీ వాళ్లంతా తనను తప్పుగా అర్థం చేసుకొని తను మాట్లాడే మాటలకు భయపడ్డారని వెల్లడించింది. 
 
లోబోను చాలా మిస్ అవుతున్నాను అంటూ ఎమోషనల్ గా తెలిపింది. ఇక ఈ షో స్క్రిప్టు కాదని తెలిపింది. తను చేసిన పాత్రల వల్లే తనకు ఈ అవకాశం వచ్చిందని.. మళ్లీ సీరియల్స్‌‌కి పెళ్లి అర్ధపావు భాగ్యంగా అలరిస్తానని తెలిపింది. ఇక మా డాక్టర్ బాబు జైలు నుంచి వచ్చారో లేదో తెలియడం లేదు.. కానీ.. మా డాక్టర్ బాబు బాగుండాలి.. మా దీప బాగుండాలి త్వరలోనే మీ ముందుకు వస్తాను అంటూ అభిమానులతో ముచ్చట్లు పెట్టింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మిడ్ నైడ్ వాష్ రూంలో రవి, లహరి హగ్ చేసుకున్నారు...