Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జనవరి 25న అఖిల్ అక్కినేని-వెంకీ ‘మిస్టర్ మజ్ను’

జనవరి 25న అఖిల్ అక్కినేని-వెంకీ ‘మిస్టర్ మజ్ను’
, శుక్రవారం, 14 డిశెంబరు 2018 (19:59 IST)
అఖిల్ అక్కినేని హీరోగా శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర ఎల్‌ఎల్‌పి పతాకంపై ‘తొలిప్రేమ’ ఫేం వెంకీ అట్లూరి దర్శకత్వంలో భారీ నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మిస్తున్న యూత్‌పుల్ ఎంటర్‌టైనర్ ‘మిస్టర్ మజ్ను’. ఈ చిత్రాన్ని రిపబ్లిక్ డే కానుకగా ఒకరోజు ముందు జనవరి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 
 
ఈ సందర్భంగా నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ మాట్లాడుతూ ‘‘ఒక పాట మినహా టోటల్‌గా షూటింగ్ పూర్తయింది. ఈ చిత్రంలోని పాటలను ఒక్కొక్కటిగా విడుదల చేయబోతున్నాం. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి రిపబ్లిక్ డే కానుకగా ఒకరోజు ముందు జనవరి 25న వరల్డ్‌వైడ్‌గా ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నాం’’ అన్నారు. 
 
అఖిల్ అక్కినేని సరసన నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో నాగబాబు, ప్రియదర్శి, జయప్రకాష్, హైపర్ ఆది ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. 
ఈ చిత్రానికి సంగీతం: థమన్, పాటలు: శ్రీమణి, సినిమాటోగ్రఫీ: జార్జ్ సి. విలియమ్స్, ఎడిటింగ్: నవీన్ నూలి, ఆర్ట్: అవినాష్ కొల్లా, కొరియోగ్రఫీ: శేఖర్, నిర్మాత: బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వెంకీ అట్లూరి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పాట‌ల చిత్రీక‌ర‌ణ‌లో `విన‌య విధేయ రామ‌`