Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శ్రీదేవి తర్వాత ఆ స్థాయిలో నటించగల సామర్థ్యం నాకే వుంది.. కంగనా రనౌత్

Advertiesment
10 years
, గురువారం, 25 ఫిబ్రవరి 2021 (21:02 IST)
ప్రముఖ నటి శ్రీదేవి తర్వాత ఆమె స్థాయిలో కామెడీ పాత్రల్లో కూడా నటించగల సామర్థ్యం తనకు మాత్రమే సొంతమని బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ తెలిపింది. ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వంలో రూపొందిన 'తను వెడ్స్ మను' ఈ  ఏడాదితో 10 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆమె మాట్లాడుతూ, అప్పటి వరకు ఒకే రకమైన పాత్రలను పోషించిన తన కెరీర్‌ను ఈ చిత్రం మార్చి వేసిందని చెప్పింది. 
 
ఈ చిత్రంలో ఒక విభిన్నమైన పాత్రతో ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నానని తెలిపింది. శ్రీదేవి తర్వాత ఆ స్థాయిలో కామెడీని పోషించింది తానేనని చెప్పింది. ఒక నటిగానే కాకుండా దర్శకత్వంలో సైతం తన ప్రతిభను నిరూపించుకుంది. బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుట్ మరణం తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో, సాక్షాత్తు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేను కూడా ఏకిపారేసింది. ఆపై మహారాష్ట్ర నుంచి మకాం మార్చేసిన సంగతి తెలిసిందే. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

‘షాదీ ముబారక్’కు నాది గ్యారంటీ అంటోన్న‌ దిల్‌రాజు