Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

శర్వానంద్‌‍కు హైబ్రీడ్ పిల్లను పిక్స్ చేసిన 'ఆర్ఎక్స్100' డైరెక్టర్?

శర్వానంద్‌‍కు హైబ్రీడ్ పిల్లను పిక్స్ చేసిన 'ఆర్ఎక్స్100' డైరెక్టర్?
, శనివారం, 18 ఏప్రియల్ 2020 (16:49 IST)
తెలుగు చిత్ర పరిశ్రమలో ఓ సంచలన చిత్రంగా రికార్డులకెక్కిన చిత్రం "ఆర్ఎక్స్ 100". ఈ చిత్రానికి విజయ్ భూపతి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం తర్వాత ఇప్పటివరకు మరో చిత్రానికి దర్శకత్వం వహించలేక పోయారు. దీనికి కారణం ఆయన చెప్పిన కథ ఏ ఒక్క హీరోకి నచ్చకపోవడమే. 
 
కానీ, ఆయన చేతిలో ప్రస్తుతం మహాసముద్రం అనే పేరుతో ఓ కథ ఉంది. ఈ చిత్రం కథను విన్న యువహీరో శర్వానంద్ ఓకే చెప్పేశారట. పైగా, ఈ చిత్రంలో హీరోయిన్‌గా తొలుత సమంతను తీసుకోవాలని ప్లాన్ చేశారు. 
 
కానీ, సమంతను కాదని అదితీరావు హైదరీని బుక్ చేసినట్టు వార్తలు వచ్చాయి. అయితే, ఇపుడు హైబ్రీడ్ పిల్ల సాయిపల్లవి పేరును ఖరారు చేసినట్టు ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. 
 
ఇటీవలె ఆమెకు డైరెక్టర్ కథ వినిపించాడట. నటనకు ఆస్కారం ఉన్న పాత్ర కావడంతో సాయిపల్లవి ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. శర్వానంద్, సాయిపల్లవి ఇప్పటికే 'పడి పడి లేచె మనసు' సినిమాలో కలిసి నటించిన సంగతి తెలిసిందే. అలాగే, సమంత - శర్వానంద్‌లు కూడా "జాను" అనే చిత్రంలో కలిసి నటించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆకలి కంటే.. దాని కోసమే పరితపిస్తున్నారు.. శ్రీరెడ్డి సెన్సేషనల్ కామెంట్స్