Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

శ్రీలీలకు చెక్ పెట్టనున్న పూజా హెగ్డే.. ఎలాగో తెలుసా?

pooja hegde

సెల్వి

, సోమవారం, 28 అక్టోబరు 2024 (11:10 IST)
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే శ్రీలీల చేతిలో రెండు తెలుగు సినిమాలను కోల్పోయింది. గుంటూరు కారం, ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాల్లో పూజా హెగ్డే స్థానంలో శ్రీలీల నటించింది. 
 
పూజా హెగ్డే స్థానంలో శ్రీలీలని తీసుకోవాలని చిత్రనిర్మాతలు తీసుకున్న నిర్ణయంతో, "అల వైకుంఠపురంలో" ఫేమ్ పూజా హెగ్డే..  టాలీవుడ్‌లో తన పాపులారిటీని కోల్పోయింది. తరువాతి రెండేళ్లపాటు మరో పాత్రను పొందలేకపోయింది. 
 
ప్రస్తుతం పూజా హెగ్డే సీన్ మారింది. వరుణ్ ధావన్ కొత్త చిత్రంలో నటించే ఛాన్సును పూజా హెగ్డే సొంతం చేసుకుందని.. వరుణ్ ధావన్ తండ్రి, చిత్రనిర్మాత డేవిడ్ ధావన్ దర్శకత్వం వహించనున్నాడని బాలీవుడ్ మీడియా పేర్కొంది. 
 
మొదట్లో వరుణ్ ధావన్ సరసన శ్రీలీల హీరోయిన్‌గా నటించాలని మేకర్స్ భావించారు. అయితే శ్రీలీల తెలుగులో కూడా పాపులారిటీ కోల్పోయిందని అర్థమైపోయింది.
 
 
 
పూజా హెగ్డే శ్రీలీలాను చెక్‌మేట్ చేసి, ఈ చిత్రానికి సంతకం చేయాలని నిర్ణయించుకుంది. శ్రీలీల బాలీవుడ్ అరంగేట్రం ఇప్పుడు పూజా హెగ్డే ఖాతాలో చేరింది. 
 
అయితే పూజా హెగ్డే ఇప్పుడు తమిళ, హిందీ చిత్ర పరిశ్రమల్లో ఆఫర్లు దక్కించుకుంటోంది. పూజా హెగ్డే ఇటీవలే దళపతి విజయ్‌తో ఓ సినిమా చేసింది. సూర్యతో మరో సినిమా కూడా చుట్టేసింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పుష్ప 2 కు పారితోషికం వద్దన్న అల్లు అర్జున్ - వెయ్యికోట్లు, వెయ్యి థియేటర్లు నిజమేనా?