Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మంత్రగత్తెలకు భయపడవద్దు.. వారిని కాల్చిన వారికి భయపడండి.. కంగనా రనౌత్ పోస్ట్

Samantha_Kangana

ఠాగూర్

, సోమవారం, 21 అక్టోబరు 2024 (20:37 IST)
Samantha_Kangana
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ తాజాగా చేసిన ఓ పోస్ట్ ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. త్రగత్తెలకు భయపడొద్దు.. వారిని కాల్చినవారికి భయపడండి అంటూ ఆమె ఓ ట్వీట్ చేశారు. 
 
మంత్రగత్తెలు తమ ఉన్నత స్వభావానికి, అంతర్ దృష్టికి ప్ర‌సిద్ధి. వారు స్వేచ్ఛా స్ఫూర్తితో అనుసంధానించబడిన మహిళలు. లొంగని సంకల్ప శక్తి.. హద్దులను ఛేదించాలనే అనియంత్రిత కోరికతో ఉన్న‌వారు. 
 
ర‌హ‌స్యంగా భయప‌డే పంజరంలో ఉన్నవారిని శపించబడిన వారిని బెదిరించే విచ్. ప్రతిభావంతులైన వ్యక్తులకు కొన్ని దుష్ట శక్తులు ఉన్నాయని వారిని బూడిద చేయాల‌ని విశ్వసిస్తారు. దుఃఖం చాలా రూపాల్లో ఉంది. 
 
అసూయ అనేది అన్నింటికంటే దయనీయమైనది. మీరు అసూయపడాలని లేదా ప్రేరణ పొందాలని ఏదో ఒక‌టి ఎంచుకోవచ్చు.. కానీ తెలివిగా ఎంపిక చేసుకోండి. ప్రేరణ పొందాలని ఎంచుకునే వారు త‌దుప‌రి ఎంపికల్లో విజ‌యం సాధిస్తారు. 
 
పంజరాన్ని విచ్ఛిన్నం చేసి విముక్తి పొందండి అని కంగ‌న నోట్ రాసింది. ఈ నోట్‌లో తాను ఒక మంత్ర‌గ‌త్తె అని అంగీక‌రించ‌డ‌మేగాక‌ స్వేచ్ఛా జీవిని అని ఆమె ఈ పోస్ట్ ద్వారా ప్రకటించుకున్నారు.

అయితే దీనికి స‌మంత రూత్ ప్ర‌భు త‌న మ‌ద్దతును ప్ర‌క‌టించింది. కంగ‌న పోస్ట్ స్క్రీన్ షాట్‌ను పోస్ట్ చేసి, ఈ నోట్‌తో ఏకీభవిస్తున్నట్లు స‌మంత వర్డ్ అనే ప‌దాన్ని జోడించింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

లడ్డూపై పవన్ వ్యాఖ్యలు.. కోర్టుకు హాజరు కావాలని సమన్లు జారీ