Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పుష్ప-2లో సమంతకు బదులు శ్రీలీల.. డ్యాన్స్ ఇరగదీస్తుందా?

sreeleela

సెల్వి

, గురువారం, 18 జనవరి 2024 (17:15 IST)
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప: ది రైజ్‌లోని ఊ అంటావా పాటలో తన నృత్యంతో ప్రేక్షకులను ఉర్రూతలూగించిన సమంతా రూత్ ప్రభు స్థానంలో శ్రీలీల రానుంది. పుష్ప సీక్వెల్.. పుష్ప 2: ది రూల్‌లో యువ నటి శ్రీలీల డ్యాన్స్ ఉన్నట్లు సమాచారం. సీక్వెల్‌లో శ్రీలీల ప్రత్యేక డ్యాన్స్ ఉంటుందని, శ్రీలీల పాట ద్వారా సినిమాకు ప్రత్యేక ఆకర్షణను తీసుకురావాలని భావిస్తున్నారు.
 
పుష్ప: ది రైజ్‌లోని ఐటెమ్ నంబర్‌లో అత్యుత్తమ నటనకు పేరుగాంచిన సమంతా ఊ అంటావా పాటలో కనిపించినందుకు రూ.5 కోట్లు చెల్లించినట్లు సమాచారం. అయితే, పుష్ప-2లో డ్యాన్స్ నంబర్ కోసం శ్రీలీల ఎంపిక చేయబడిందని.. ఇందుకోసం రూ. 2 కోట్లు చెల్లించినట్లు టాక్ వస్తోంది.
 
సుకుమార్ దర్శకత్వం వహించిన పుష్ప 2: ది రూల్ ఆగస్ట్ 15, 2024న విడుదల కానుంది. ఈ చిత్రంలో అల్లు అర్జున్, రష్మిక మందన్న, ఫహద్ ఫాసిల్, జగపతి బాబు, ప్రకాష్ రాజ్, సునీల్, అనసూయ తదితరులు నటిస్తున్నారు. 
 
మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై నవీన్ యెర్నేని, యలమంచిలి రవిశంకర్ నిర్మిస్తున్న ఈ సినిమా బడ్జెట్ 500 కోట్ల రూపాయలు. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చగా, మిరోస్లా కుబా బ్రోజెక్ సినిమాటోగ్రఫీని నిర్వహిస్తుండగా, కార్తీక శ్రీనివాస్-రూబెన్ ఎడిటర్లుగా పనిచేస్తున్నారు.
 
పుష్ప-2లో శ్రీలీల ఐటమ్ గర్ల్‌గా ఇరగదీస్తుందని పుకార్లు వినిపిస్తున్నాయి. కాగా శ్రీలీల ప్రస్తుతం మహేష్ బాబుతో కలిసి గుంటూరు కారం సినిమాలో నటించింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం జనవరి 12, 2024న విడుదలైంది. ఈ చిత్రం 200 కోట్ల రూపాయల బడ్జెట్‌తో తెరకెక్కింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఈ పోస్టర్ తో వచ్చిన తంటా - జూనియర్ ఎన్టీఆర్ తప్పిదమేనా !