Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బాలయ్య సరసన కేథరిన్.. నో చెప్పిన నిర్మాతలు.. ఎందుకో తెలుసా?

బాలయ్య సరసన కేథరిన్.. నో చెప్పిన నిర్మాతలు.. ఎందుకో తెలుసా?
, బుధవారం, 22 జనవరి 2020 (17:27 IST)
నందమూరి హీరో బాలకృష్ణ సరసన నటించే ఆఫర్‌ కేథరిన్‌కు చేజారిపోయిందని టాలీవుడ్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. గ‌త ఏడాది ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు ఈ సినిమాతో ఆకట్టుకోలేకపోయిన బాలయ్య.. త‌ర్వాత రూలర్ సినిమాతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించాడు. అయిన‌ప్ప‌టికీ ఈ చిత్రం కూడా బాక్సాఫిస్ వ‌ద్ద బోల్తా ప‌డింది.
 
ప్ర‌స్తుతం నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో హ్యాట్రిక్‌ సినిమా ప్రారంభమైంది. ఈ సినిమాలో బాలయ్యకు జోడీగా కేథరిన్‌ను తీసుకోవాలనుకున్నారు. కానీ ఆమె నో చెప్పినట్లు సమాచారం. పారితోషికం ఎక్కువగా డిమాండ్ చేయడం ద్వారా ఆమెను నిర్మాతలు పక్కనబెట్టారని తెలుస్తోంది. గతంలో వరుస ఫ్లాపుల్లో ఉన్న బాలయ్యకు ‘సింహా’ వంటి బ్లాక్ బస్టర్‌తో మంచి సక్సెస్ అందించాడు బోయపాటి. ప్రస్తుతం కూడా అదే పనిలో వున్నాడని టాక్. 
 
ఇకపోతే.. ఈ చిత్రంలో విలన్ పాత్రలో శ్రీకాంత్ కనిపిస్తున్నాడని తెలిసింది. 2020 సమ్మర్‌లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలనే ప్లాన్‌లో ఉన్నారు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. మరి కేథరిన్‌ స్థానంలో ఏ హీరోయిన్‌ ఎంపికవుతుందో వేచి చూడాలి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సౌత్‌లో రజినీ దర్బార్.. రూ.200 కోట్ల కబ్ల్‌లోకి