Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఇంట్లో ఉంటూనే రూ.లక్షల్లో సంపాదిస్తున్న ఆ ఇద్దరు తారలు? ఎలా?

ఇంట్లో ఉంటూనే రూ.లక్షల్లో సంపాదిస్తున్న ఆ ఇద్దరు తారలు? ఎలా?
, మంగళవారం, 19 మే 2020 (15:35 IST)
కరోనా వైరస్ వ్యాప్తి నిరోధకానికి దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమలు చేస్తున్నారు. ఇది ఈ నెలాఖరు ఉంటుంది. ఈ లాక్డౌన్ కారణంగా సినీ షూటింగులన్నీ బంద్ అయ్యాయి. దీంతో సినీ ఇండస్ట్రీకి చెందిన 24 కళలకు చెందిన వారు తమతమ ఇళ్ళకే పరిమితమైవున్నారు. అయితే, హీరోయిన్లు మాత్రం తమతమ గృహాల్లోనే ఉంటూనే రూ.లక్షల్లో సంపాదిస్తున్నట్టు ఓ వార్త ఇపుడు వెలుగులోకి వచ్చింది. ముఖ్యంగా, టాలీవుడ్ హీరోయిన్లు కాజల్ అగర్వాల్, తమన్నా భాటియాలు ఈ కోవలో ముందువరుసలో ఉన్నట్టు సమాచారం. అసలు లాక్డౌన్ వెళ వీరిద్దరు మాత్రం ఎలా రూ.లక్షల్లో సంపాదిస్తున్నారన్నదే కదా మీ సందేహం. అయితే, ఈ కథనం చదవండి. 
 
ప్రతి ఒక్క హీరోయిన్‌కు ఇన్‌స్టాగ్రామ్ ఖాతా వుంది. అలాగే, లక్షల్లో ఫాలోయర్లు కూడా ఉన్నారు. ఇదే వారికి ఓ మంచి అవకాశంగా మారింది. ఉదాహరణకు కాజల్ అగర్వాల్‌కు 14.5 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. అలాగే, తమన్నాకు 10.5 మిలియన్ల మంది ఉన్నారు. దీంతో ఈ లాక్డౌన్ సమయంలో తమ ఖాతాల ద్వారా ప్రమోషనల్ పోస్టింగులను పెడుతూ వీరు లక్షలాది రూపాయలను సంపాదిస్తున్నట్టు తెలుస్తోంది. 
 
మామూలుగా సినిమా తారలకున్న ఆదరణను బట్టి ఒక్కో పోస్టింగుకి రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ఆయా సంస్థలు చెల్లిస్తుంటాయి. ఈ క్రమంలో కాజల్, తమన్నాలకు ఒక్కో పోస్టింగుకి సుమారు రూ.5 లక్షలు వస్తున్నట్టు ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు. అంటే ఇంట్లోనే ఖాళీగా వుండి కూడా ఈ ముద్దుగుమ్మలు లక్షల్లో సంపాదిస్తున్నారన్న మాట. చూశారా.. తాము సంపాదించుకున్న గ్లామరు, ఇమేజు వీళ్లకు ఎలా ఉపయోగపడుతోందో! అదండీ వెండితెర వైభోగం. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నిర్మాతల సంక్షేమం కోరి... రెమ్యునరేషన్ తగ్గించుకున్న తాప్పీ