Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆ హీరోయిన్ అందానికి 'ఫిదా' అయిన మాటల మాంత్రికుడు?

తెలుగు వెండితెరకు పరిచయమైన కొత్త హీరోయిన్లలో అను ఇమ్మాన్యుయేల్ ఒకరు. ఈమె అందానికి టాలీవు్డ్‌లో అనేక మంది హీరోలతో పాటు.. డైరక్టర్లు కూడా ఫిదా అయిపోయారు. ఫలితంగా తాము తీసే చిత్రాల్లో అనూను హీరోయిన్‌గా స

ఆ హీరోయిన్ అందానికి 'ఫిదా' అయిన మాటల మాంత్రికుడు?
, శనివారం, 16 సెప్టెంబరు 2017 (12:42 IST)
తెలుగు వెండితెరకు పరిచయమైన కొత్త హీరోయిన్లలో అను ఇమ్మాన్యుయేల్ ఒకరు. ఈమె అందానికి టాలీవు్డ్‌లో అనేక మంది హీరోలతో పాటు.. డైరక్టర్లు కూడా ఫిదా అయిపోయారు. ఫలితంగా తాము తీసే చిత్రాల్లో అనూను హీరోయిన్‌గా సెలెక్ట్ చేసుకునేందుకు పోటీపడుతున్నారు. ఇలాంటి వారిలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒకరు. 
 
నాని ప్రధాన పాత్రలో రూపొందిన 'మజ్ను' చిత్రంతో అను తెలుగు తెరకు పరిచయమైంది. ఈ చిత్రంలో అమ్మడి నటనకు మంచి మార్కులు పడ్డాయి. దీంతో త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంలో పవన్ కళ్యాణ్‌ సరసన నటించే గోల్డెన్ ఛాన్స్ కొట్టేసింది. ఇక ఇప్పుడు మరోసారి ఈ అమ్మడిని తన సినిమాలో హీరోయిన్‌గా తీసుకోవాలని మాటల మాంత్రికుడు భావిస్తున్నట్టు ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. 
 
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇటీవలే "జై లవ కుశ" చిత్రం షూటింగ్‌ను పూర్తి చేశాడు. ఈ సినిమా ఈనెల 21వ తేదీన రిలీజ్ కానుంది. ఈ మూవీ తర్వాత త్రివిక్రమ్తో ఓ ప్రాజెక్ట్ చేయనున్నాడు. ఈ సినిమాలో తారక్‌కి జోడిగా అను ఎమ్మాన్యుయేల్‌ని సెలక్ట్ చేయాలని త్రివిక్రమ్ భావిస్తున్నట్ట సమాచారం. 
 
అను ఎమ్మాన్యుయేల్ ప్రస్తుతం పవన్ సినిమాతో పాటు బన్నీ- వక్కంతం వంశీ కాంబినేషన్ లో రూపొందుతున్న "నా పేరు సూర్య. . నా ఇల్లు ఇండియా" అనే చిత్రంలోనూ నటిస్తున్న విషయం తెల్సిందే. మొత్తంమీద త్రివిక్రమ్‌ను ఇట్టే ఆకర్షించిన అనుకు ఇక టాలీవుడ్‌లో తిరుగులేదని చెప్పొచ్చు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రజినీతో జట్టు కట్టేందుకు సిద్ధం : కమల్ హాసన్ ప్రకటన