Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు అంతా సిద్ధం..

యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు అంతా సిద్ధం..
, గురువారం, 27 ఫిబ్రవరి 2020 (13:15 IST)
యాదగిరి గుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ రోజు నుంచి మార్చి 7 వరకు బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ నెల 28న అలంకార వేడుకలు నిర్వహించనున్నారు. మార్చి 3న ఎదుర్కోలు, 4న తిరుకల్యాణం, 5న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి రథోత్సవం, 7న అష్టోత్తర శత ఘటాభిషేకం జరగనుంది.
 
ప్రధాన ఆలయ విస్తరణ పనులు జరుగుతుండటంతో బాలాలయంలోనే ఉత్సవాలు నిర్వహించనున్నారు. అటు.. మార్చి 2 నుంచి 7 వరకు యాదాద్రిలో సాంస్కృతిక ఉత్సవాలు కూడా జరగనున్నాయి. యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల దృష్ట్యా ఈ నెల 26 నుంచి మార్చి 7వ తేదీ వరకు శాశ్వత, మొక్కు కల్యాణోత్సవాలు, బ్రహ్మోత్సవాలు, సుదర్శన నారసింహ హోమాలు రద్దు చేస్తున్నట్లు ఆలయ ఈవో గీత తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కేరళ సీరియల్ కిల్లర్ జూలీ ఆత్మహత్యాయత్నం.. ఎందుకో?