Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ప్రజలకు వినోదాన్ని పంచుతాం, అనుమతివ్వండి: మంత్రి తలసానికి విజ్ఞప్తి

ప్రజలకు వినోదాన్ని పంచుతాం, అనుమతివ్వండి: మంత్రి తలసానికి విజ్ఞప్తి
, శనివారం, 2 మే 2020 (19:29 IST)
లాక్ డౌన్ కారణంగా ప్రజలు ఇళ్లలోనే ఉంటున్నారని, వారికి ఎంటర్టైన్మెంట్ అందించేందుకు గాను షూటింగ్‌లకు అనుమతులు ఇవ్వాలని పలు ఛానళ్ళ ప్రతినిధులు కోరారు. 
 
మంత్రి శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను స్టార్ మా బిజినెస్ హెడ్ అలోక్ జైన్, ఈ టీవీ సీఈఓ బాపినీడు, జీ తెలుగు బిజినెస్ హెడ్ అనురాధ గూడూర్, జెమిని టీవీ బిజినెస్ హెడ్ కె.సుబ్రహ్మణ్యం, తెలుగు ప్రొడ్యూసర్ కౌన్సిల్ చైర్మన్ ప్రసాద్‌లు కలిసి వినతిపత్రాన్ని అందజేశారు. 
 
టివి షూటింగ్‌లకు తక్కువ సంఖ్యలో సిబ్బంది అవసరం ఉంటుందని, ప్రభుత్వ నిబంధనల ప్రకారం వ్యవహరిస్తూ షూటింగ్‌లను నిర్వహిస్తామని వారు మంత్రికి వివరించారు. 
 
కరోనా నియంత్రణ చర్యలలో భాగంగా అమలు చేస్తున్న లాక్ డౌన్ కారణంగా ప్రజలు బయటకు వెళ్ళలేకపోతున్నారని, వారికి ఎంటర్టైన్మెంట్ అందించేందుకు షూటింగ్‌లను నిర్వహించుకునేందుకు అనుమతులు ఇప్పించాలని వారు కోరారు. 
 
స్పందించిన మంత్రి ఈ నెల 5వ తేదీన ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగే క్యాబినెట్ సమావేశం అనంతరం ఈ అంశంపై పరిశీలిస్తామని తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పోకో ఎఫ్2 ప్రో స్మార్ట్ ఫోన్ ధరలు లీక్.. ఎంతో తెలుసా?