Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

హుస్నాబాద్‌‌లో క్రికెట్ ఆడుతూ గుండెపోటుతో యువకుడి మృతి

Advertiesment
Telangana Man
ఇటీవలికాలంలో ఉన్నట్టుండి గుండెపోటులకు గురై మృత్యువాత పడుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరిగిపోతుంది. క్రీడలు ఆడుతూ చనిపోతారు. మరికొందరు కూర్చొనివున్న చోటే మృత్యువాతపడుతున్నారు. ఈ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. 
 
తాజా తెలంగాణ రాష్ట్రంలోని సిద్ధిపేట హుస్నాబాద్‌లో క్రికెట్ ఆడుతూ ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. పట్టణంలో జరుగుతున్న కేఎంఆర్‌ క్రికెట్‌ టోర్నమెంట్‌లో శనిగరం ఆంజనేయులు (37) పాల్గొన్నారు. 
 
ఈ క్రమంలో బౌలింగ్‌ చేస్తుండగా ఆయనకు గుండెపోటు వచ్చింది. దీంతో ఆంజనేయులు ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. వెంటనే సహచరులు సీపీఆర్‌ చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. మృతుడి స్వస్థలం చిగరుమామిడి మండలం సుందరగిరి. ఈ ఘటనతో హుస్నాబాద్‌లో విషాదం నెలకొంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కోనసీమ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం