Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Friday, 11 April 2025
webdunia

తెలంగాణా అసెంబ్లీ సమావేశాలు : అక్టోబరు 5 వరకు...

Advertiesment
Telangana Assembly
, శుక్రవారం, 24 సెప్టెంబరు 2021 (14:22 IST)
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు శుక్రవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఉదయం 11 గంటలకు మొదలైనప్పటికీ తొలి రోజున ఇటీవల మరణించిన భ‌ద్రాచ‌లం మాజీ ఎమ్మెల్యే కుంజ బొజ్జి, ములుగు మాజీ ఎమ్మెల్యే అజ్మీరా చందులాల్, హుజూరాబాద్ మాజీ ఎమ్మెల్యే కేతిరి సాయిరెడ్డి, బూర్గంపాడు మాజీ ఎమ్మెల్యే కుంజా భిక్షం, క‌రీంన‌గ‌ర్ మాజీ ఎమ్మెల్యే ఎం స‌త్యనారాయ‌ణ‌రావు, వ‌ర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే మాచ‌ర్ల జ‌గన్నాథం, రామాయంపేట మాజీ ఎమ్మెల్యే ముత్యం రెడ్డి, సుజాత న‌గ‌ర్ మాజీ ఎమ్మెల్యే బొగ్గార‌పు సీతారామ‌య్య‌, కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యే చేకూరి కాశ‌య్యకు మాజీ ఎమ్మెల్యేలకు ఉభయ సభలు సంతాపం తెలిపాయి. సంతాప తీర్మానాల అనంతరం శాసన సభ, మండలి సోమవారానికి వాయిదాపడ్డాయి.
 
మరోవైపు, తెలంగాణలో వర్షకాల అసెంబ్లీ సమావేశాలు అక్టోబరు ఐదో తేదీ వరకు జరుగనున్నాయి. శాసన సభలోని స్పీకర్‌ చాంబర్‌లో సభాపతి పోచారం శ్రీనివాస్‌ రెడ్డి అధ్యక్షతన బీఏసీ సమావేశం జరిగింది. 
 
ఈ సమావేశంలో సీఎం కేసీఆర్‌, మంత్రులు హరీశ్‌ రావు, ప్రశాంత్‌రెడ్డి, నిరంజన్‌ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, అక్బరుద్దీన్‌ ఒవైసీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వచ్చే నెల 5 వరకు సమావేశాలను నిర్వహించాలని బీఏసీ నిర్ణయించింది. ఈనెల 25, 26 (శని, ఆదివారాలు), అక్టోబర్‌ 2న గాంధీ జయంతి, అక్టోబర్‌ 3 (ఆదివారం) తేదీల్లో సభకు సెలవు దినాలుగా ప్రకటించింది. మొత్తంగా ఏడు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తిరుమల: టీటీడీ ప్రత్యేక దర్శనం టికెట్ల ఆన్‌లైన్ బుకింగ్‌కి ప్రయత్నిస్తే జియో‌మార్ట్ ఓపెన్.. కారణం చెప్పిన టీటీడీ