Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బార్లలో వన్ ప్లస్ వన్ ఆఫర్... ఒక్కరోజే రూ.350 కోట్ల మద్యం సేల్స్

తెలంగాణ రాష్ట్రంలోని మందుబాబులు తెగ తాగి పండుగ చేసుకున్నారు. బార్లలో వన్ ప్లస్ వన్ ఆఫర్ ప్రకటించారు. దీంతో ఆ రాష్ట్ర అబ్కారీ శాఖకు ఒక్కరోజే కోట్లాది రూపాయల ఆదాయం వచ్చింది.

Advertiesment
Liquor
, సోమవారం, 2 అక్టోబరు 2017 (11:02 IST)
తెలంగాణ రాష్ట్రంలోని మందుబాబులు తెగ తాగి పండుగ చేసుకున్నారు. బార్లలో వన్ ప్లస్ వన్ ఆఫర్ ప్రకటించారు. దీంతో ఆ రాష్ట్ర అబ్కారీ శాఖకు ఒక్కరోజే కోట్లాది రూపాయల ఆదాయం వచ్చింది. ఒక్క పండుగ పూటరోజే ఏకంగా రూ.350 కోట్ల విలువ చేసే మద్యాన్ని సేవించారు. ఒక్క హైదరాబాద్ నగరంలోనే రూ.100 కోట్ల మేరకు విక్రయాలు జరిగాయి. అంతేనా.. చుక్కతో పాటు ముక్క కూడా తిన్నారు. ఫలితంగా దసర పండుగ రోజున మాంసం విక్రయాలు కూడా టాప్ గేర్‌లో సాగాయి. 
 
దసరా పండుగ సందర్భంగా రాష్ట్రంలో భారీ ఎత్తున మద్యం వ్యాపారం జరిగినట్టు ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు. దసరా పండుగ రోజు ఏకంగా 5.5 లక్షల కేసులు విక్రయించినట్టు తెలిపారు. ఇందులో 3 లక్షల ఇండియన్ మేడ్ లిక్కర్ (ఐఎంఎల్) కాగా, 2.5 లక్షల బీర్ల కేసులు కూడా ఉన్నాయి.
 
అక్టోబరు ఒకటో తేదీ నుంచి తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మద్యం పాలసీ అమల్లోకి రానుండడంతో పాత స్టాకును వదిలించుకోవడమే లక్ష్యంగా డీలర్లు విక్రయాలు సాగించారు. దీంతో చివరి మూడు రోజుల్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. బార్లలో వన్ ప్లస్ వన్‌లాంటి ఆఫర్లు కూడా ప్రకటించారు. ఒక్క గ్రేటర్ హైదరాబాద్‌లోనే రూ.వంద కోట్ల వ్యాపారం జరగ్గా గ్రామీణ ప్రాంతాల్లో రూ.250 కోట్ల విక్రయాలు జరిగాయి. 
 
మరోవైపు దసరా అంటేనే చుక్క-ముక్క అని భావించడంతో మాంసం విక్రయాలు కూడా ఎన్నడూ లేనంతగా సాగాయి. సికింద్రాబాద్, జియాగూడ, చెంగిచెర్ల తదితర హోల్‌సేల్ మాంసం మార్కెట్లలో శని, ఆదివారాల్లో రూ.30 కోట్ల విలువైన విక్రయాలు జరిగినట్టు అంచనా.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భారత్‌పై విశ్వాసం కోల్పోయిన కాశ్మీరీలు.. యశ్వంత్ సిన్హా