Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నాడు బద్ధశత్రువులు.. నేడు బెస్ట్ ఫ్రెండ్స్ : కేసీఆర్‌తో పయ్యావుల ఏకాంత చర్చలు!

తెలంగాణ ఉద్యమ సమయంలో తెరాస అధినేత కేసీఆర్‌పై టీడీపీ సీనియర్ నేత పయ్యావుల కేశవ్ అనేక రకాలైన విమర్శలు గుప్పించారు. ఈ విమర్శలు దీంతో వారిద్దరి మధ్య వైరానికి దారితీశాయి కూడా. ముఖ్యంగా రాష్ట్ర విభజనను పయ్య

Advertiesment
Telangana CM KCR
, ఆదివారం, 1 అక్టోబరు 2017 (18:16 IST)
తెలంగాణ ఉద్యమ సమయంలో తెరాస అధినేత కేసీఆర్‌పై టీడీపీ సీనియర్ నేత పయ్యావుల కేశవ్ అనేక రకాలైన విమర్శలు గుప్పించారు. ఈ విమర్శలు దీంతో వారిద్దరి మధ్య వైరానికి దారితీశాయి కూడా. ముఖ్యంగా రాష్ట్ర విభజనను పయ్యావుల తీవ్రంగా వ్యతిరేకించారు. అనంతపురం వేదికగా చేసుకుని విద్యార్థులతో ఉద్యమం కూడా నడిపారు. దీంతో కేసీఆర్, పయ్యావులలు బద్ధశత్రువులుగా మారారు. 
 
అయితే, అదంతా గతం. రాష్ట్ర విభజన జరిగిపోయి రెండేళ్లు పూర్తయింది. ఈ నేపథ్యంలో ఆదివారం అనంతపురం జిల్లా వెంకటాపురంలో ఏపీ మంత్రి పరిటాల సునీత కుమారుడు శ్రీరామ్ వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వివాహా వేడుకకు తెలంగాణ సీఎం కేసీఆర్ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. 
 
ఈ సందర్భంగా ఓ ఆసక్తికర విషయం చోటుచేసుకుంది. ఈ వివాహా వేడుకకు హాజరైన కేసీఆర్, టీడీపీ నేత పయ్యావుల కేశవ్‌తో కొంచెం సేపు మాట్లాడినట్టు సమాచారం. ఐదారు నిమిషాల పాటు ఆయనతో కేసీఆర్ ఏకాంతంగా సంభాషించారని, ముఖ్యంగా, ఏపీ రాజకీయాలపై, ఇటీవల జరిగిన నంద్యాల, కాకినాడ ఎన్నికలపైనా ఆరా తీశారని తెలుస్తోంది. తెలంగాణ రాజకీయాల గురించీ పయ్యావులతో కేసీఆర్ మాట్లాడినట్టు వినికిడి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇకపై ఆ ఆరు బ్యాంకుల చెక్‌బుక్‌లు చెల్లవు..