Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

విషాదాంతమైన వలస కూలీల ప్రయాణం.. సీలేరు నదిలో...

Advertiesment
Migrant Labourers
సొంతూళ్ళకు వెళ్లాలన్న వలస కూలీల ప్రయాణం విషాదాంతమైంది. లాక్డౌన్ కారణంగా ప్రజా రవాణా లేకపోవడంతో వారంతా నాటు పడవలను ఎంచుకున్నారు. ఈ పడవలు నీటిలో మునిగిపోవడంతో ఈ విషాదం జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, తెలంగాణలో లాక్డౌన్ నేపథ్యంలో సొంత రాష్ట్రమైన ఒడిశా వెళ్లిపోవాలని భావించిన 11 మంది వలస కూలీలు ప్రయాణమయ్యారు. దీంతో గత అర్థరాత్రి విశాఖ జిల్లా సీలేరుకు చేరుకున్నారు. అక్కడి నుంచి రెండు నాటు పడవల్లో బయలుదేరారు. 
 
ఈ క్రమంలో వారి పడవలు ఒక్కసారిగా నీట మునిగాయి. మొత్తం 11 మంది నదిలో మునిగిపోయారు. వారిలో ముగ్గురు సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు. తర్వాత కాసేపటికి చిన్నారి మృతదేహం లభ్యం కాగా, గల్లంతైన మిగతా ఏడుగురి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలంగాణాలో మరోవారం లాక్డౌన్ ప్రారంభం : సీఎం కేసీఆర్ నిర్ణయం