Publish Date: Tue, 19 Oct 2021 (15:41 IST)
Updated Date: Tue, 19 Oct 2021 (15:44 IST)
ఖమ్మం జిల్లాలో సోమవారం 21 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఖమ్మం జిల్లాలో మొత్తం 4,605మందికి పరీక్షలు నిర్వహించగా 16 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మొత్తం 988మందికి పరీక్షలు నిర్వహించగా 10 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
ఖమ్మం జిల్లా ప్రధాన ఆసుపత్రిలోని కొవిడ్ వార్డులో సోమవారం ముగ్గురు చేరారు. ఇద్దరు కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. మొత్తం 320బెడ్లున్న ఈ వార్డులో ప్రస్తుతం 20మంది చికిత్స పొందుతున్నారు. 300 బెడ్లు ఖాళీగా ఉన్నాయి.