Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రంగారెడ్డిలో ఆటో బోల్తా... ఎనిమిది మంది విద్యార్థులకు తీవ్ర గాయాలు

Advertiesment
Auto
రంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. ఇందులో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. మరో నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి. ఆటో బోల్తా ప‌డటంతో ఈ ఘటన చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే జిల్లాలోని కుల్కచర్ల మండలం ముజాహిద్ పూర్ వద్ద విద్యార్థులతో వెళ్తున్న ఆటో అదుపుతప్పి బోల్తా ప‌డింది. 
 
ఈ ప్ర‌మాదంలో ఆటోలో ఉన్న ఎనిమిది మంది విద్యార్థులు గాయపడ్డారు. గాయపడ్డ విద్యార్థులను స్థానికులు పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ప్ర‌మాద స‌మ‌యంలో ఆటోలో మొత్తం ఇరవై మంది విద్యార్థున్నట్లు సమాచారం. విద్యార్థులంతా ముజాహిద్ పూర్ మోడల్ స్కూలుకు వెళ్తుండగా ఈ ఘటన జ‌రిగింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎయిర్‌టెల్ యూజర్లకు భారీ షాక్, ఛార్జీలు బాదుడే బాదుడు