Publish Date: Tue, 01 Feb 2022 (11:00 IST)
Updated Date: Tue, 01 Feb 2022 (11:03 IST)
ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ)లోని అన్ని కోర్సులకు ఆఫ్లైన్ తరగతులు ఫిబ్రవరి 1 మంగళవారం నుంచి ప్రారంభమవుతాయని సోమవారం అధికారులు తెలిపారు.
ప్రభుత్వ సూచనల మేరకు ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని అన్ని కళాశాలల్లోని అన్ని కోర్సులకు ఫిబ్రవరి 1, 2022 నుంచి ఆఫ్లైన్ తరగతులు ప్రారంభమవుతాయని ఓయూ నుంచి పత్రికా ప్రకటనలో తెలిపారు. అంతకుముందు సోమవారం, విశ్వవిద్యాలయ అధికారులు దాని కోర్సులు ఆన్లైన్ మోడ్లో జరుగుతాయని పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో "నగరంలోని కోవిడ్ మహమ్మారి పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, అండర్ గ్రాడ్యుయేట్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల యొక్క ప్రస్తుత సెమిస్టర్ పరీక్షలన్నింటికీ OU ఫిబ్రవరి 12 వరకు ఆన్లైన్ మోడ్లో తరగతులను కొనసాగిస్తుంది" అని OU ఓ ప్రకటన ద్వారా తెలియజేసింది.