Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Monday, 21 April 2025
webdunia

12 వరకు జేఎన్‌టీయూసీ - హెచ్‌ విద్యార్థులకు ఆన్‌లైన్ తరగతులు

Advertiesment
JNTU - Hyderabad
, ఆదివారం, 30 జనవరి 2022 (18:48 IST)
జవహర్ లాల్ నెహ్రూ టెక్నాలజికల్ విశ్వవిద్యాలయం - హైదరాబాద్‌లో అండర్ గ్యాడ్యుయేట్ మొదటి, రెండు సంవత్సరంలో విద్యార్థులకు ఫిబ్రవరి 12వ తేదీ వరకు ఆన్‌లైన్ తరగతులు కొనసాగుతాయని యూనివర్శిటీ అధికారులు వెల్లడించారు. 
 
ప్రస్తుతం కోవిడ్-19 భద్రతా నిబంధనలను అనుసరించి వారికి క్యాంపస్ తరగతులు నిర్వహించబడతాయని వెల్లడించారు. ఏది ఏమైనప్పటికీ అండర్ గ్రాడ్యుయేట్ మూడు నాలుగు సంవత్సరంతో పాటు ఫార్మ్‌డితో సహా అన్ని పీజీ కోర్సులకు క్లాస్ వర్క్‌ లేదా పరీక్షలు ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి ఒకటో తేదీ నుంచి కోవిడ్-19 నిబంధనల మేరకు జరుగుతాయని వెల్లడించారు. 
 
ఈ మేరకు విశ్వవిద్యాలయం అన్ని రాజ్యాంగ, అనుబంధ కాలేజీలకు తెలియజేస్తూ ఒక లేఖను విడుదల చేశారు. వివిధ కోర్సుల తరగతుల నిర్వహణపై ఫిబ్రవరి 1 నుంచి అన్ని విద్యా సంస్థలను తిరిగి తెరవడానికి రాష్ట్ర ప్రభుత్వం శనివారం అనుమతించినందున భౌతిక తరగతుల కోసం కళాశాలలను తిరిగి తెరవడానికి విశ్వవిద్యాలయంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కరోనా వ్యాక్సినేషన్‌లో సరికొత్త రికార్డు సాధించిన భారత్