Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Agnipath Live: అర్థం చేసుకోండి, అపోహలొద్దు, 10% రిజర్వేషన్లు కల్పిస్తాం: కేంద్రం కీలక నిర్ణయం

Advertiesment
Agneepath protest
, శనివారం, 18 జూన్ 2022 (10:46 IST)
అగ్నిపథ్ పథకంపై దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఆందోళన పెల్లుబుకడంతో కేంద్ర ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. అగ్నిపథ్ పథకాన్ని అర్థం చేసుకోవాలని కోరింది. ఆర్మీలో పనిచేసి రిటైర్ అయిన అగ్నివీరులకు కేంద్ర సాయుధ బలగాలు, అస్సాం రైఫిల్స్ నియామకాల్లో 10 శాతం రిజర్వేషన్లు కల్పించనున్నట్లు కేంద్ర హోంశాఖ శనివారం ప్రకటన జారీ చేసింది. ఈ రెండింటిలో చేరేందుకు అవసరమైన గరిష్ఠ వయోపరిమితిలోనూ అగ్నివీరులకు మూడేళ్లు సడలింపు ఇవ్వనున్నట్లు తెలిపింది.
 
రాకేష్ మృతదేహంతో ర్యాలీకి ప్లాన్
అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా యువకులు చేపట్టిన ఆందోళన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో హింసాత్మకంగా మారింది. నిరసనకారులు విధ్వంసానికి దిగగా.. రైల్వే పోలీసులు కాల్పులు జరిపారు. ఫైరింగ్‌లో రాకేష్ అనే యువకుడు చనిపోగా.. మరో 13 మందికి గాయాలయ్యాయి. సికింద్రాబాద్ ఆందోళన, కాల్పుల ఘటనకు తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తోంది టీఆర్ఎస్. కాల్పుల్లో చనిపోయిన రాకేష్ ది వరంగల్ జిల్లా. దీంతో వరంగల్ జిల్లాలో భారీ నిరసనలకు టీఆర్ఎస్ సిద్ధమవుతోంది. 
 
ఇప్పటికే నర్సంపేట నియోజకవర్గ బంద్‌కు టీఆర్ఎస్ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్జి పిలుపునిచ్చారు. ఇక రాకేష్ డెడ్ బాడీతో నర్యంపేటలో భారీ ర్యాలీ చేయడానికి టీఆర్ఎస్ పార్టీ ప్లాన్ చేసింది. వరంగల్ ఎంజీఎం నుంచి నర్సంపేట మీదుగా రాకేష్ స్వగ్రామం దబీల్ పురా వరకు ర్యాలీ తీయడానికి స్థానిక ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఏర్పాట్లు చేశారు.
 
సీఎం కేసీఆర్ ఆదేశాలతోనే నర్సంపేట బంద్‌కు ఎమ్మెల్యే పెద్ది పిలుపిచ్చారని తెలుస్తోంది. అధికార పార్టీ సీనియర్ నేత పల్లా రాజేశ్వర్ రెడ్డి కూడా ఉదయాన్నే ఎంజీఎంకు వచ్చి రాకేష్ మృతదేహానికి నివాళి అర్పించారు. రాకేష్ మృతిపై విచారం వ్యకం చేసిన కేసీఆర్.. 25 లక్షల రూపాయల పరిహారం ప్రకటించారు. మోడీ సర్కార్ పై నిప్పులు చెరిగారు. మోడీ దుర్మార్గ విధానాలకు రాకేష్ బలయ్యాడని కేసీఆర్ ఆరోపించారు.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రాకేష్ డెడ్ బాడీతో భారీ నిరసనలకు టీఆర్ఎస్ ప్లాన్