Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కిడ్నీ సమస్యలతో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కన్నుమూత

Advertiesment
maganti gopinath

ఠాగూర్

, ఆదివారం, 8 జూన్ 2025 (11:06 IST)
భారత రాష్ట్ర సమితికి చెందిన ఎమ్మెల్యే గోపీనాథ్ అనారోగ్యంతో మృతి చెందారు. జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానం నుంచి ప్రాతినథ్యం వహిస్తున్న ఆయన గత కొంతకాలంగా కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు. ఈ నెల 5వ తేదీన గుండెపోటు రావడంతో గచ్చిబౌలిలోని ఏఐజీ  ఆస్పత్రిలో చేర్చగా, అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం 5.45 గంటలకు తుదిశ్వాస విడిచినట్టు వైద్యులు తెలిపారు. 
 
ఈ నెల 5వ తేదీన గోపీనాథ్ గుండెపోటుకు గురయ్యారు. కుటుంబ సభ్యులు వెంటనే ఆయనను గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు ఆయనకు కార్డియాక్ అరెస్ట్ అయినట్టు గుర్తించి, సీపీఆర్ చేశారు. ఆ తర్వాత ఆయన గుండె తిరిగి కొట్టుకోవడం ప్రారంభించి, నాడి, రక్తపోటు సాధారణ స్థాయికి చేరడంతో ఐసీయూలో వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తూ వచ్చారు.
 
కాగా, గోపీనాథ్ గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత సమస్యలతో ఇబ్బందిపడుతున్నట్టు సమాచారం. ఈ క్రమంలో మూడు నెలల క్రితం కూడా ఆయన ఏఐజీ ఆస్పత్రిలో చేరి డయాలసిస్ చేయించుకున్నారు. తాజాగా ఆయనకు గుండెపోటు రావడంతో మళ్లీ మృతి చెందారు. 
 
కాగా, టీడీపీతో 1982లో తన రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టిన ఆయన... 1985లో హైదరాబాద్ నగర తెలుగు యువత అధ్యక్షుడుగా బాధ్యతలు చేపట్టారు. ఆయన నియామక పత్రాన్ని స్వయంగా ఎన్టీఆర్ అందజేయడం గమనార్హం. 
 
ఆ తర్వాత 2014లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ తరపున జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో 2018లో అప్పటి తెరాసలో చేరారు. అదే యేడాది జరిగిన ముందస్తు ఎన్నికల్లో ఆయన బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి రెండోసారి విజయం సాధించారు. 
 
గత 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ గెలుపొంది వరుసగా మూడోసారి గెలుపొంది అసెబ్లీలోకి అడుగుపెట్టారు. 2022లో ఆయన బీఆర్ఎస్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడుగా కీలక బాధ్యతలు స్వీకరించారు. గోపీనాథ్ మృతిపెట్టల పలువురు తమ ప్రగాఢ సంపాతాన్ని సానుభూతిని వ్యక్తం చేస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మద్యం మత్తులో భార్య అనుకుని పక్కింటి అమ్మాయిని కత్తితో పొడిచిన భర్త!!