Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఎర్రగడ్డ మెంటల్ ఆస్పత్రిలో ఫుడ్ ఫాయిజన్ : ఓ రోగి మృతి - మరో 70 మందికి...

Advertiesment
Food Varieties

ఠాగూర్

, బుధవారం, 4 జూన్ 2025 (09:03 IST)
హైదరాబాద్ నగరంలోని ఎర్రగడ్డలోని మెంటల్ ఆస్పత్రిలో ఫుడ్ పాయిజన్ అయింది. ఈ కల్తీ ఆహారాన్ని ఆరగించిన 70 మంది రోగులు అస్వస్థకు లోనయ్యారు. ఈ ఘటనలో కిరణ్ అనే మానసిక రోగి మృతి చెందగా, పరిస్థితి విషమంగా ఉన్న మరో ఇద్దరిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మిగిలిన 67 మంది రోగుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. 
 
ఈ సంఘటనపై ఆరోగ్య శాఖామంత్రి దామోదర రాజనర్సింహా ఆరా తీశారు. రోగులకు ఫుడ్ పాయిజన్ ఎలా జరిగిందనే విషయంపై అధికారులు ఆరా తీస్తున్నారు. జిల్లా కలెక్టర్ అనుదీప్ మంగళవారం రాత్రి మానసిక వైద్యశాలను సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. 
 
మీ అందరి బాగోతాలు వెల్లడిస్తానంటున్న రాజాసింగ్ 
 
తెలంగాణ, హైదరాబాద్ నగరానికి చెందిన బీజేపీ సీనియర్ నేత రాజసింగ్ పార్టీ పెద్దలకు ఓ బహిరంగ సవాల్ విసిరారు. దమ్ముంటే తనను సస్పెండ్ చేయాలని ఆయన ఛాలెంజ్ విసిరారు. పైగా, సస్పెండ్ చేస్తే అందరి జాతకాలు బహిర్గతం చేస్తానంటూ హెచ్చరించారు. తనకు నోటీసులు పంపాలన్న ఆలోచనే ఏమాత్రం భావ్యం కాదని, పైగా, ఎవరి వల్ల పార్టీకి నష్టమో ప్రజల ముందు ఉంచుతానని ఆయన వెల్లడించారు. 
 
తనకు పార్టీ నోటీసులు జారీ చేయాలని యోచిస్తున్నట్టు వస్తున్న వార్తలపై ఆయన తాజాగా స్పందించారు. తనకు నోటీసులు ఇవ్వడం కాదు.. ధైర్యముంటే తనను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని ఆయన సవాల్ విసిరారు. తనను సస్పెండ్ చేస్తే పార్టీలోని కొందరు అసలు స్వరూపాలను బయటపెడతానని, అందరి జాతకాలు ప్రజలు ముందు ఉంచుతానని హెచ్చరించారు. 
 
కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు, నాయకత్వానికి  దూరంగా ఉంటున్నారనే ఆరోపణలతో పాటు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారనే కారణాలతో రాజాసింగ్‌‍కు పార్టీ షోకాజ్ నోటీసులు జారీ చేసేందుకు సిద్ధమైనట్టు వార్తలు వస్తున్నాయి. వీటిపై ఆయన పై విధంగా స్పందించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మేనల్లుడిని చంపి బాడీని ముక్కలు చేసిన మేనత్త... శరీర భాగాలను సిమెంట్‌తో పాతిపెట్టిన తండ్రి..