Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Man: మార్నింగ్ వాక్ చేస్తున్న వ్యక్తిని కాల్చి చంపేశారు..

Advertiesment
shooting

సెల్వి

, మంగళవారం, 15 జులై 2025 (09:17 IST)
హైదరాబాద్ మలక్‌పేటలోని శాలివాహన్ నగర్ పార్క్ వద్ద మార్నింగ్ వాక్ చేస్తున్న వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. బాధితుడిని స్థానిక నివాసి చందు రాథోడ్ (40)గా గుర్తించారు. వివరాల్లోకి వెళితే.. చందు రాథోడ్ తన దినచర్య ప్రకారం వాకింగ్ ట్రాక్‌పై నడుచుకుంటూ వెళుతుండగా గుర్తు తెలియని వ్యక్తులు పార్కులోకి ప్రవేశించి అతనిపై మూడు రౌండ్లు కాల్పులు జరిపారు.
 
చందు రాథోడ్ అనేక బుల్లెట్ గాయాలతో నేలపై కుప్పకూలి అక్కడికక్కడే మరణించాడు. భయాందోళనకు గురైన స్థానికులు, పార్కులో ఉదయం వాకింగ్ చేస్తున్న ఇతర వ్యక్తులు వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న మలక్‌పేట పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. 
 
హంతకులను గుర్తించి వీలైనంత త్వరగా వారిని పట్టుకోవడానికి వారు నేరం జరిగిన ప్రదేశం, చుట్టుపక్కల ప్రాంతాల నుండి సిసిటివి ఫుటేజ్‌లను పరిశీలిస్తున్నారు. పాత కక్ష్యలే హత్యకు దారితీసిందని పోలీసులు అనుమానిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వివాదంలో మెగాస్టార్ చిరంజీవి నివాసం... హైకోర్టు కీలక ఆదేశాలు