Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జైలుకు వెళ్లినా నా భార్య నాతోనే ఉంటుంది : అఘోరీ (Video)

Advertiesment
lady aghori nagasadhu

ఠాగూర్

, బుధవారం, 23 ఏప్రియల్ 2025 (17:29 IST)
తనపై అక్రమంగా చీటింగ్ కేసు నమోదు చేసి జైలుకు పంపినా తన భార్య వర్షిణి మాత్రం తనతోనే ఉంటుందని లేడీ అఘోరి నాగసాధు అంటున్నారు. ఓ మహిళ ఇచ్చిన మేరకు హైదరాబాద్ నగర మోకిలా పోలీసులు మోసం కేసు నమోదు చేశారు. ఈ కేసులో నాగసాధు వద్ద పోలీసులు రెండు గంటల పాటు విచారించారు. ఈ విచారణ అనంతరం నాగసాధును అరెస్టు చేశారు. ఆ తర్వాత చేవెళ్ల కోర్టులో హాజరుపరిచి, జైలుకు తరలించారు. 
 
దీనిపై అఘోరీ స్పందిస్తూ, తాను జైలుకు వెళ్లినా తన భార్య నాతోనే ఉంటుందని చెప్పారు. చట్టం తన పని తాను చేసుకుని పోతుందన్నారు. ప్రస్తుతానికి తానేమీ మాట్లాడనని, తాను జైలుకు వెళ్లినా తన భార్య వర్షిణి మాత్రం తనతోపాటు ఉంటుందని అఘోరీ చెప్పుకొచ్చారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 
 
అఘోరీకి బెయిల్ ఎపుడు వస్తుందో తెలియదు : లాయర్ 
 
చీటింగ్ కేసులో అరెస్టయిన మహిళా అఘోరీకి బెయిల్ ఎపుడు వస్తుందో తెలియదని ఆమె తరపు న్యాయవాది అంటున్నారు. దీనిపై లాయర్ స్పందిస్తూ, బెయిల్ ఎపుడు వస్తుందో చెప్పలేమని, చీటింగ్ కేసు కాబట్టి ఏ విధంగా చర్యలు తీసుకుంటారో కూడా చెప్పలేమన్నారు. 
 
ఈ కేసులో అఘోరీకి పదేళ్లలోపు శిక్ష పడే అవకాశం అవకాశం ఉందన్నారు. తనకు కేసు పేపర్లు మాత్రమే ఇస్తారని, ఎలాంటి విషయాలు చెప్పలేమన్నారు. అఘోరీకి న్యాయస్థానాన్ని కూడా తప్పుదోవ పట్టిస్తుందని ఆమె తరపు న్యాయవాది వెల్లడించారు. 
 
ఇదిలావుంటే, పూజల పేరుతో ఓ మహిళ నుంచి రూ.10 లక్షలు తీసుకుని, మోసం చేసిన కేసులో పోలీసులు అఘోరీని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం చేవెళ్ళ కోర్టుకు తరలించారు. ఈ క్రమంలో అఘోరీకి న్యాయమూర్తి రిమాండ్ విచారించారు. ఈ కేసులో కోర్టులో ఉందని, ఈ కేసులో పోలీసులకు సహకరిస్తానని అఘోరీ తెలిపారు. 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పహల్గామ్ ఉగ్రదాడి : కాశ్మీర్‌కు బుక్కింగ్స్‌ను రద్దు చేసుకుంటున్న టూరిస్టులు!!