Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Telangana: 5.80 కిలోల గంజాయి చాక్లెట్ల స్వాధీనం-నిందితుడి అరెస్టు

Advertiesment
ganja

సెల్వి

, బుధవారం, 23 ఏప్రియల్ 2025 (09:07 IST)
ఖమ్మం ప్రొహిబిషన్ ఎక్సైజ్ శాఖ అధికారులు ఎదులాపురం మున్సిపాలిటీ పరిధిలో ఆకస్మిక సోదాలు నిర్వహించి 5.80 కిలోల గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు.
 
గుర్రాలపాడు సమీపంలోని వినాయక గ్రానైట్ ఫ్యాక్టరీ వెనుక ఉన్న ఇళ్లలో సోదాలు నిర్వహించగా, బానోత్ హరియా అనే వ్యక్తి ఇంట్లో గంజాయి చాక్లెట్లు స్వాధీనం చేసుకున్నట్లు ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ బి చంద్రమోహన్ తెలిపారు. 
 
నిందితులు ఒడిశా నుండి గంజాయి చాక్లెట్లను కొనుగోలు చేసి స్థానికంగా విక్రయించేవారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ సోదాల్లో ఎక్సైజ్ శాఖ సిబ్బంది ఆర్ సురేంద్ర కుమార్, ఎస్ కె మౌలకర్, బి గురుప్రసాద్, బి నరసింహ, బి భద్రమ్మ పాల్గొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్లీజ్.. చంపొద్దంటూ వేడుకున్నా కనికరించలేదు .. విశాఖ వాసిని వెంటాడి.. వేటాడి కాల్చేశారు...