Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో కవిత.. తండ్రిని చూసి భావోద్వేగం.. కాళేశ్వరం విచారణకు కేసీఆర్

Advertiesment
KCR_Kavitha

సెల్వి

, బుధవారం, 11 జూన్ 2025 (09:47 IST)
KCR_Kavitha
ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో కేసీఆర్ తనయ కవిత తన తండ్రిని కలిశారు. ఇక హరీశ్ రావు కూడా నిన్నటి నుంచి ఫాంహౌస్‌లోనే ఉన్నారు. మరికాసేపట్లో కేసీఆర్ కాళేశ్వరం విచారణకు హాజరు కానున్నారు. ఈ సందర్భంగా తండ్రి కేసీఆర్‌ని చూసి కవిత భావోద్వేకానికి గురైంది. భర్త అనిల్‌తో కలిసి కవిత ఫాంహౌస్‌కు వచ్చింది. కాళేశ్వరం కమిషన్‌ విచారణకు ముందు భేటీపై ఉత్కంఠ రేపుతుంది. 
 
ఇకపోతే.. కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ కీలక దశకు చేరుకుంది. ఈ అంశంపై విచారణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇదివరకే పలువురు అధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులు, అప్పటి మంత్రులను విచారించింది. తాజాగా, బుధవారం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను విచారించనుంది.
 
మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడం, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు సీపేజీ సమస్యలు తలెత్తిన నేపథ్యంలో, గత ఏడాది మార్చిలో సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ పీసీ ఘోష్‌తో ప్రభుత్వం న్యాయ విచారణ కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం విదితమే.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వరకట్నంగా కిడ్నీ అడిగిన అత్తమామలు... నిరాకరించిన కోడలిపై దాడి...