ప్రముఖ నటి మీరా జాస్మిన్ నటుడు షైన్ టామ్ చాకో కుటుంబంపై సంతాపం వ్యక్తం చేసింది. ఆయన తండ్రి సిబి చాకో శుక్రవారం తమిళనాడులోని ధర్మపురి జిల్లాలో జరిగిన విషాదకరమైన కారు ప్రమాదంలో మరణించారు.
తన ఇన్స్టాగ్రామ్లో, నటుడు షైన్ టామ్ చాకో కుటుంబ చిత్రాన్ని పోస్ట్ చేసిన నటి, "దుఃఖిస్తున్న కుటుంబం కోసం ప్రార్థనలు. ఇలాంటి సమయాలు దయ ఎంత ముఖ్యమో మనకు నిరంతరం గుర్తు చేస్తాయి. దుఃఖం చాలా నిజమైన విషయం. దయతో ఉందాం..." అని రాసింది.
శుక్రవారం, షైన్ టామ్ చాకో తండ్రి సిబి చాకో మరణ వార్త మలయాళం, తమిళ చిత్ర పరిశ్రమలను దిగ్భ్రాంతికి గురిచేసింది. శుక్రవారం తమిళనాడులోని ధర్మపురి జిల్లాలోని పాలకోడ్ సమీపంలోని పరైయూర్లో ఈ ప్రమాదం జరిగింది.
ప్రమాదం జరిగినప్పుడు నటుడు షైన్ టామ్ చాకో తన తల్లి మరియా కార్మెల్, తండ్రి సిబి చాకో, సోదరుడు జో జాన్ చాకో,అతని మేనేజర్ అనిస్తో కలిసి ప్రయాణిస్తున్నట్లు టాక్.
ఈ ప్రమాదంలో షైన్ టామ్ చాకో చేయి విరిగింది. అతని తల్లి వెన్నెముకలో గాయాలయ్యాయి. అతని సోదరుడు, మేనేజర్ కూడా గాయపడ్డారు. నటుడు, అతని కుటుంబ సభ్యులు వైద్య చికిత్స కోసం బెంగళూరుకు వెళుతుండగా ప్రమాదం జరిగింది. అకస్మాత్తుగా లేన్లు మారిన లారీని కారు ఢీకొట్టడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని టాక్.
గాయపడిన వారందరినీ ప్రాథమిక చికిత్స కోసం ధర్మపురి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు, తరువాత వారు కేరళలోని త్రిస్సూర్కు తిరిగి వచ్చారు. ఇంతలో, నటుడి తండ్రి సిబి చాకో మృతదేహాన్ని త్రిస్సూర్లోని మార్చురీకి తరలించారు. న్యూజిలాండ్ నుండి నటుడు షైన్ టామ్ చాకో సోదరీమణుల రాక కోసం కుటుంబం వేచి ఉంది. ఆ తర్వాత అంత్యక్రియలు జరుగుతాయని భావిస్తున్నారు.