Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శ్రీవారి బ్రహ్మోత్సవాలను ఏకాంతంగానే నిర్వహిస్తాం: టిటిడి ఛైర్మన్

శ్రీవారి బ్రహ్మోత్సవాలను ఏకాంతంగానే నిర్వహిస్తాం: టిటిడి ఛైర్మన్
, శుక్రవారం, 17 సెప్టెంబరు 2021 (23:19 IST)
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్వాలను ఏకాంతంగానే నిర్వహిస్తామని టిటిడి వై.వి.సుబ్బారెడ్డి తెలిపారు. తిరుమలలోని అన్నమయ్యభవన్ లో మీడియాతో టిటిడి ఛైర్మన్ మాట్లాడారు. కరోనా ఉదృతి నేపథ్యంలో రాబోవు రెండు మూడు నెలలు అప్రమత్తంగా ఉండాలని కేంద్రప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసిందని.. క్రమంలో అక్టోబర్ నెలలో జరిగే శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఏకాంతంగానే  నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
 
తిరుమలలో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పరిమిత సంఖ్యలోనే భక్తులకు స్వామివారి దర్సనం కల్పిస్తున్నామని తెలిపారు మరో వారంరోజుల్లో ఆన్లైన్ ద్వారా సర్వదర్సనం టోకెన్ల ప్రక్రియ కూడా ప్రారంభిస్తున్నామన్నారు. ప్రస్తుతం ఉన్న సర్వర్లు డేటా స్పీడ్ అందుకోలేకపోతున్నాయన్నారు.
 
అందుకోసం జియో వాళ్ళతో సంప్రదింపులు జరిపామని.. త్వరలోనే సర్వదర్సన టోకెన్లను భక్తులకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు చెప్పారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సర్వదుఃఖాలను పోగొట్టే శనిమహాప్రదోషం