Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

టీటీడీ ఎక్స్ అఫిషియో సభ్యులుగా చెవిరెడ్డి ప్రమాణ స్వీకారం

Advertiesment
టీటీడీ ఎక్స్ అఫిషియో సభ్యులుగా చెవిరెడ్డి ప్రమాణ స్వీకారం
, శుక్రవారం, 17 సెప్టెంబరు 2021 (09:09 IST)
తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ఎక్స్ అఫిషియో సభ్యులుగా ప్రభుత్వ విప్, తుడ ఛైర్మెన్ డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు.

తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల చేరుకున్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైకుంఠం ద్వారం నుంచి శ్రీవారి ఆలయానికి చేరుకున్నారు. ముందుగా శ్రీవారి ఆలయంలోని గరుడాల్వార్ సన్నిధిలో  చెవిరెడ్డి చేత అదనపు ఈఓ ధర్మారెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు.

అనంతరం శ్రీవారిని దర్శించుకున్న చెవిరెడ్డి రంగనాయక మండపానికి చేరుకున్నారు. పండితులు వేద ఆశీర్వచనం పలికి శేష వస్త్రంతో ఘనంగా సత్కరించారు. స్వామి వారి చిత్రపటంతో పాటు తీర్థ ప్రసాదాలు అందజేశారు.

వ్యవస్థను మరింత పటిష్ట పరిచేందుకు శక్తి వంచన లేకుండా నా వంతు బాధ్యత నిర్వర్తిస్తానని చెవిరెడ్డి స్పష్టం చేశారు. శ్రీ వారి దర్శనార్థం విచ్చేసే భక్తులకు సేవ చేసే భాగ్యం మరోమారు దక్కడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నట్లు వెల్లడించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దేశంలో మరో 20 ఏళ్లకి సగం పట్టణాలే