Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

25 మందితో టీటీడీ పాలక మండలి... ఎమ్మెల్యే కాట‌సానికి కూడా!

Advertiesment
25 మందితో టీటీడీ పాలక మండలి... ఎమ్మెల్యే కాట‌సానికి కూడా!
విజయవాడ , గురువారం, 16 సెప్టెంబరు 2021 (11:51 IST)
తిరుమ‌ల తిరుప‌తి దేవస్థానం 25 మందితో పాలక మండలిని ఏర్పాటు చేసింది. ఇందులో రెండవ సారి ప్ర‌ముఖ పారిశ్రామిక‌వేత్త‌, తెలంగాణాకు చెందిన మైహోం రామేశ్వరరావు స్థానం ద‌క్కించుకున్నారు. 
 
హెటిరో పార్థసారథి రెడ్డి, మారంశెట్టి రాములు, వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, ముంబైకి చెందిన రాజేశ్ శర్మ, ఇండియా సిమెంట్స్ శ్రీనివాసన్ త‌దిత‌రులున్నారు. ఇంకా, పాలక మండలిలో చోటు దక్కించుకున్న వ్యాపారవేత్త మారుతి, ఆడిటర్ సనత్, యంయస్ యన్ ల్యాబ్స్ జీవన్ రెడ్డి, కోల్ కత్తాకి చెందిన సౌరభ్ తోపాటు, సభ్యులుగా డాక్టర్ కేతన్ దేశాయ్, కర్నాటక నుంచి శశిధర్, శంకర్ నియ‌మితుల‌య్యారు. 
 
 పాలకమండలి సభ్యులుగా ఏపీ నుంచి పోకల అశోక్ కుమార్, మల్లాడి కృష్ణారావు (మాజీ మంత్రి), ఎమ్మెల్యేలు కాటసాని, గొళ్ల బాబురావు,  మధుసూదన్ యాదవ్, కల్వకుర్తి విద్యాసాగర్ ఉన్నారు.
 
తమిళనాడు నుంచి వేల్లూరు ఎమ్మెల్యే నందకుమార్, కన్నయ్య, కర్నాటక నుంచి ఎమ్మెల్యే  విశ్వనాథ్ రెడ్డి ఉన్నారు.
 
టీటీడీ పాలకమండలి జాబితా ఇది...
 
ఏపి నుంచి..
పొకల అశోక్ కుమార్
మల్లాడి కృష్ణారావు
వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి
గొల్లా బాబురావు
బుర్రా మధుసూధన్
కాటసాని రాంభూపాల్ రెడ్డి
తెలంగాణ నుంచి
రామేశ్వరా రావు
పార్థసారథి రెడ్డి
లక్ష్మి నారాయణ
మారంశెట్టి రాములు
విద్యా సాగర్
మన్నే జీవన్ రెడ్డి
రాజేష్ శర్మ
తమిళనాడు నుంచి
శ్రీనివాసన్
ఎమ్మెల్యే నందకుమార్
కన్నయ్య
కర్ణాటక నుంచి శశిధర్
ఎమ్మెల్యే విశ్వనాథ్ రెడ్డి 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దేశంలో స్థిరంగా కొనసాగుతున్న ఇంధన ధరలు