Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఈ రోజు సాయంత్రం 4 గంటలకు శ్రీవారి వర్చువల్ సేవా టిక్కెట్లు విడుదల

Advertiesment
tirumala
, శుక్రవారం, 24 ఫిబ్రవరి 2023 (10:38 IST)
కలియుగ వైకుంఠంగా పేర్కొనే శ్రీ శ్రీనివాసుడు కొలువైవున్న తిరుమలలో శ్రీవారి దర్శన టిక్కెట్లను శుక్రవారం విడుదల చేయనున్నారు. మార్చి నెల కోటాకు సంబంధించి 300 రూపాయల టిక్కెట్లను ఆన్‌లైన్‌ కోటాను శుక్రవారం ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు. 
 
ఆ తర్వాత మధ్యాహ్నం 2 గంటలకు ఏప్రిల్, మే నెలకు సంబంధించి అంగ ప్రదక్షిణ టోకెన్లను జారీచేస్తారు. సాయంత్రం 4 గంటలకు వర్చువల్ సేవా టిక్కెట్ల కోటాను రిలీజ్ చేసేలా తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) అధికారులు ఏర్పాట్లు చేశారు.
 
ఇకపోతే, మార్చి నెలకుగాను కళ్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్ సేవ, సహస్ర దీపాలంకరా సేవ వర్చువల్ సేవా టిక్కెట్ల కోటాను శుక్రవారం సాయంత్రం నాలుగు గంటలుక ఆన్‌లోనే ఉంచుతామని తితిదే అధికారులు విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తేదీ 24-02-2023 శుక్రవారం దినఫలాలు - ఇష్టకామేశ్వరి దేవిని పూజించడంవల్ల శుభం...