Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

స్కంధషష్టి వ్రతం ఆచరిస్తే నాగ దోషాలు పరార్ (video)

స్కంధషష్టి వ్రతం ఆచరిస్తే నాగ దోషాలు పరార్ (video)
, శనివారం, 15 అక్టోబరు 2022 (10:14 IST)
స్కంధషష్టి వ్రతం ఆచరించడం ద్వారా నాగదోషాలు తొలగిపోతాయి. ఈ వ్రతం ద్వారా కుమార స్వామి అనుగ్రహం లభిస్తుంది. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధనవల్ల నేత్రరోగాలు, చర్మవ్యాధులు తగ్గుతాయని పెళ్లికాని వారికి వివాహం జరిగి సత్‌సంతాన సౌభాగ్యం కలిగి ఆయురారోగ్య ఐశ్వర్యములతో వర్ధిల్లుతారని భక్తుల విశ్వాసం.  

ఈ పుణ్యదినం నాడు భక్తులు ఉదయాన్నే స్నానం చేసి ఏ ఆహారమూ తీసుకోకుండా తడి బట్టలతో సుబ్రహ్మణ్యస్వామి ఆలయానికి వెళ్ళి పాలు, పండ్లు, పువ్వులు సమర్పించాలి.

జాతకంలో కుజ దోషం,కాలసర్ పదోషంచే సకాలంలో వివాహం కానివారు వల్లీ దేవసేనా సమేత సుబ్రహ్మణ్యస్వామి కళ్యాణాలను ఈ షష్ఠినాడు చేయటం కనిపిస్తుంది. ఈ వ్రతం ఆచరించి నాగ ప్రతిష్ట చేసిన వారికి సంతానం కలుగుతుందని విశ్వాసం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

15-10-2022 శనివారం దినఫలాలు - విష్ణుసహస్రనామం చదివితే సర్వదా శుభ...