Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రొయ్యల బిర్యానీ..?

రొయ్యల బిర్యానీ..?
, మంగళవారం, 19 మార్చి 2019 (11:32 IST)
కావలసిన పదార్థాలు:
బాస్మతి బియ్యం - 1 కేజీ
రొయ్యలు - కేజీన్నర
పెరుగు - 200 గ్రా
నిమ్మరసం - 3 స్పూన్స్
కారం - 20 గ్రా
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 100 గ్రా
ఉప్పు - 50 గ్రా
గరంమసాలా - 20 గ్రా
నూనె - 100 గ్రా
వేగించిన ఉల్లి ముక్కలు - 30 గ్రా
జీడిపప్పు - కొద్దిగా
కొత్తిమీర - 15 గ్రా
పుదీనా - 15 గ్రా
బిర్యానీ ఆకులు - 5 గ్రా
డాల్డా - 150 గ్రా
నీళ్లు - 5 లీటర్లు
 
తయారీ విధానం:
ముందుగా రొయ్యలను శుభ్రం చేసుకుని ఆపై ఒక గిన్నెలో రొయ్యలు వేసి వాటిలో నిమ్మరసం, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరంమసాలా, వేయించిన ఉల్లి ముక్కలు, పెరుగు, కొత్తిమీర, పుదీనా తరుగు, ధనియాల పొడి, నూనె వేసి బాగా కలుపుకోవాలి. దీన్ని రెండు నుండి మూడు గంటలు పాటు అలానే ఉంచుకోవాలి. ఇప్పుడు మరో గిన్నెలో నీళ్లు పోసి అందులో గరం మసాలా, బిర్యానీ ఆకులు వేయాలి. నీళ్లు ఉడుకుపట్టాక కడిగి పెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని వేయాలి. బియ్యం సగం ఉడికాక నీళ్లు వంపేయాలి. అన్ని వైపులా సమంగా ఉన్న గిన్నె తీసుకుని అందులో ముందుగా నానబెట్టుకున్న రొయ్యల్ని ఒక పొరలా వేయాలి. వాటిపైన సగం ఉడికించిన బిర్యానీ రైస్‌ను పొరలా పరవాలి. పైన నెయ్యి వేయాలి. 
 
ఈ గిన్నెను ఒక తవాపై ఉంచి సన్నటి మంటమీద 25 నిమిషాల పాటు ఉడికించాలి. ఆ తర్వాత గిన్నె మీద మూత పెట్టి ఆవిరి బయటకు రాకుండా గిన్నెను, కొత్తిమీర, పుదీనాల తరుగు, జీడిపప్పు, వేగించిన ఉల్లిపాయ ముక్కలతో అలంకరించాలి. అంతే... ఘుమఘుమలాడే రొయ్యల బిర్యానీ రెడీ.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పెరుగుతో అందం రెట్టింపు... ఇలా చేస్తే...