Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కొబ్బరి పూర్ణం తయారీ విధానం..?

Advertiesment
kobbari poornam
, సోమవారం, 18 మార్చి 2019 (11:35 IST)
కావలసిన పదార్థాలు:
సెనగపప్పు - అరకప్పు
పచ్చికొబ్బరి తరుగు - అరకప్పు
బెల్లం - ముప్పావు కప్పు 
యాలకుల పొడి - కొద్దిగా
నెయ్యి - స్పూన్
బియ్యం పిండి - 1 కప్పు
నీరు - ఒకటింబావు కప్పు
నువ్వుల నూనె - స్పూన్
ఉప్పు - కొద్దిగా
 
తయారీ విధానం:
ముందుగా పచ్చి సెనగపప్పును బాణలిలో వేయించిన తర్వాత నీళ్ళల్లో అరగంట నానబెట్టాలి. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్‌లో సెనగపప్పును వేసి తగినన్ని నీళ్లు పోసి మూడు విజిల్స్ వచ్చేవరకు ఉడికించాలి. తరువాత కుక్కర్‌లో మిగిలిన నీళ్లను వడగట్టి పప్పు బాగా చల్లారాక అందులో పచ్చికొబ్బరి, యాలకుల పొడి కలిపి మిక్సీలో గ్రైండ్ చేసి బెల్లం తరుగు వేసి మళ్లీ గ్రైండ్ చేయాలి. 
 
ఆ తరువాత పెద్ద బౌల్‌లో బియ్యం పిండి, నువ్వుల నూనె వేసి ఉప్పు మరిగిన నీటిలో వేసి కలుపుకోవాలి. ఆపై పిండి మెత్తగా అయ్యేవరకు కలిపి 2 నిమిషాలు మూతపెట్టాలి. కాసేపటి తరువాత బియ్యం పిండి మిశ్రమాన్ని నువ్వుల నూనెతో మెత్తటి ముద్దలా చేసి ఆరనివ్వాలి.

పిండి ముద్దలోంచి కొద్ది కొద్దిగా పిండిని తీస్తూ కప్పు ఆకారంలో చేసి అందులో పూర్ణం పెట్టాలి. తర్వాత్ మోదక్ షేపులో మడవాలి. ఆపై ఇడ్లీ ప్లేట్లను తీసుకుని వాటికి నూనెరాసి మోదక్‌లను వాటిలో పెట్టాలి. ఇడ్లీ కుక్కర్ అడుగు భాగంలో కొన్ని నీళ్లు పోసి మోదక్‌లను 10 నిమిషాలు ఉడికించాలి. అవి ఉడికిన 2 నిమిషాలు తర్వాత బయటకు తీసి చల్లారనివ్వాలి. అంతే... కొబ్బరి పూర్ణం రెడీ. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఒత్తిడికి కారణాలేంటి?