Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Pregnant: మరదలిని గర్భవతిని చేశాడు.. జీవితఖైదు విధించిన కోర్టు.. లక్ష జరిమానా

Advertiesment
Pregnant

సెల్వి

, శుక్రవారం, 14 మార్చి 2025 (19:40 IST)
దేశంలో మహిళల భద్రత ప్రశ్నార్థకంగా మారుతోంది. మహిళలపై అత్యాచార ఘటనలు కూడా పెరుగుతున్నాయి. అదేవిధంగా, గృహ హింస రోజురోజుకూ పెరుగుతోంది. గృహ హింసకు సంబంధించిన కేసులు కోర్టులలో పేరుకుపోతున్నాయని గణాంకాలు ద్వారా తెలుస్తోంది. తాజాగా మరదలిని గర్భం చేసిన కేసులో ఓ వ్యక్తికి జీవిత ఖైదు, లక్ష రూపాయల జరిమానా విధిస్తూ పోక్సో కోర్టు తీర్పు వెలువరించింది.
 
వివరాల్లోకి వెళితే.. రాజ్ కుమార్ నాయక్ ఒరిస్సా రాష్ట్రానికి చెందినవాడు. అతనికి 28 సంవత్సరాలు, వివాహితుడు. జీవనోపాధి కోసం 2018 డిసెంబర్‌లో తన కుటుంబంతో కలిసి చెన్నైకి వచ్చాడు. ఆ సమయంలో, ఇంటికి వచ్చిన భార్య సోదరి 16 ఏళ్ల మరదలిని గర్భం చేశాడు. 
 
దీనికి సంబంధించి 2019 నవంబర్‌లో ఎన్నూర్ మహిళా పోలీసులలో కేసు నమోదైంది. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి తిరువళ్లూరు మహిళా కోర్టులో దాఖలు చేశారు. ఈ కేసులో తొమ్మిది మంది సాక్షులను విచారించారు. 
 
ఈ కేసు విచారణకు సంబంధించి తీర్పు వెలువడింది. అందులో, రాజ్‌కుమార్ నాయక్‌కు జీవిత ఖైదు, లక్ష రూపాయల జరిమానా విధించాలని, జరిమానా చెల్లించని పక్షంలో 3 సంవత్సరాల జైలు శిక్ష అనుభవించాలని న్యాయమూర్తి సరస్వతి ఆదేశించారు. దీని తరువాత, రాజ్‌కుమార్ నాయక్‌ను చెన్నై పుళల్ సెంట్రల్ జైలులో ఉంచారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Nizamabad: పోలీసు కస్టడీలో నిజామాబాద్ వ్యక్తి మృతి.. ఏం జరిగింది?