తమిళనాడు దిండుక్కల్లో ఘోరం జరిగింది. బస్సు నుంచి కిందపడిన మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
తమిళనాడు కోవిల్పట్టికి తర్వాత విఎస్ కోట్టై ప్రాంతానికి చెందిన 50 ఏళ్ల అమరావతి.. తన కుమార్తె ఇంటికి వెళ్లి తిరిగి ఓ ప్రైవేట్ బస్సులో వస్తుండగా.. కనవాయ్ పట్టి సమీపంలో కండెక్టర్ ఇచ్చిన టికెట్ను చేతిలోకి తీసుకునే క్రమంలో మహిళ కిందపడి ప్రాణాలు కోల్పోయింది.
బస్సు మెట్లకు దగ్గర నిల్చుండటంతో పాటు కండక్టర్ ఇచ్చిన టిక్కెట్టును తీసుకునే క్రమంలో కమ్మీని పట్టుకోకపోవడం వల్లే ఆ మహిళ అదుపుతప్పి బస్సు నుంచి బయట పడింది. దీంతో తీవ్రగాయాల పాలైన మహిళ ప్రాణాలు కోల్పోయింది.