Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఐదేళ్ళ బాలికపై అంకుల్ అత్యాచారం.. నదిలో శవం

ఐదేళ్ళ బాలికపై అంకుల్ అత్యాచారం.. నదిలో శవం
, ఆదివారం, 9 జూన్ 2019 (11:12 IST)
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఐదేళ్ళ బాలికపై ఆ బాలిక అంకుల్‌తో పాటు మరికొందరు కలిసి అత్యాచారం జరిపారు. ఆ తర్వాత చిన్నారిని హత్య చేసి బావిలో పడేశారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణ ఘటన వివరాలను పరిశీలిస్తే, 
 
పవిత్ర పుణ్యక్షేత్రమైన ఉజ్జయినిలో ఇటీవల ఐదేళ్ళ బాలిక అత్యాచారానికి గురైంది. ఆ తర్వాత ఆమెను దారుణంగా హత్య చేసి చంపేశారు. నిజానికి ఈ చిన్నారి శుక్రవారం అదృశ్యంకాగా, అదే రోజు తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని బాలిక కోసం గాలిస్తున్న పోలీసులు సాయంత్రం షిప్రా నదిలో తేలియాడుతున్న బాలిక మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. 
 
చిన్నారి శరీరంపై ఉన్న గాయాలను బట్టి ఆమెపై అత్యాచారం జరిగినట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. శనివారం నాటి వైద్య పరీక్షల్లో బాలికపై అత్యాచారం జరిగినట్టు తేలింది. ఈ కేసులో బాలిక అంకుల్ సహా ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు ప్రశ్నిస్తున్నారు. బాలికపై అత్యాచారం, హత్య ఘటనతో మధ్యప్రదేశ్ వేడెక్కింది. ప్రతిపక్షాలు ఈ ఘటనను ఆయుధంగా చేసుకుని ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జగన్‌పై అలిగిన రోజమ్మ... అక్కడకు డుమ్మా.. కీలక పదవి ఇచ్చే దిశగా...