Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నీటిని వృథా చేస్తే రూ.5 వేలు ఫైన్.. కాపలాగా సెక్యూరిటీ కూడా నియామకం!!

tap water

ఠాగూర్

, మంగళవారం, 5 మార్చి 2024 (16:22 IST)
కర్నాటక రాష్ట్రంలో తీవ్రమైన నీటి ఎద్దడి నెలకొనివుంది. బిందెడు నీటి కోసం ఆ రాష్ట్రంలోని పలు ప్రాంతాల ప్రజలు తల్లడిల్లిపోతున్నారు. దీంతో బెంగుళూరు హౌసింగ్ సొసైటీ నిర్వాహకులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇష్టానుసారంగా నీటిని వృథా చేస్తే రూ.5 వేల జరిమానా విధించాలని నిర్ణయించారు. పైగా, ఎవరూ నీటిని వృథా చేయకుండా చూసేందుకు ప్రత్యేకంగా ఓ సెక్యూరిటీ గార్డును కూడా నిర్వాహకులు నియమించారు. ఈ మేరకు బెంగుళూరు వైట్‌ఫీల్డ్‌లోని ఫామ్ మెడోస్ హౌసింగ్ సొసైటీ నిర్ణయం తీసుకుంది. 
 
బెంగుళూరు నగరంలో నీటి ఎద్దడిని తీవ్రంగా ఎదుర్కొంటున్న ప్రాంతాల్లో ఇదొకటి. యలహంక, కనకపుర ప్రాంతాలు కూడా నీటికి కటకటలాడుతున్నాయి. సొసైటీలో నివసిస్తున్న వారికి నోటీసులు జారీచేసిన పామ్ మెడోస్.. గత నాలుగు రోజులుగా బెంగళూరు వాటర్ సప్లై, సీవరేజ్ బోర్డు నుంచి నీళ్లు రావడం లేదని అందులో పేర్కొంది. 
 
బోర్‌వెల్స్‌ ద్వారా నీటిని ఏదో రకంగా అందిస్తున్నామని, త్వరలోనే భూగర్భ జలాలు కూడా ఎండిపోయే ప్రమాదం ఉందని పేర్కొంది. కాబట్టి ఈ కష్టసమయాన్ని ఎదుర్కొనేందుకు ప్రతి యూనిట్‌కు నీటి సరఫరాను 20 శాతం తగ్గించాలని నిర్ణయించినట్టు తెలిపింది. అందరూ దీనికి కట్టుబడి ఉండాలని, దీనిని ఎవరైనా ఉల్లంఘిస్తే అదనంగా రూ.5 వేలు చెల్లించాల్సి ఉంటుందని నోటీసుల్లో హెచ్చరించింది. 
 
అంతేకాదు, వేసవి తీవ్రత పెరిగే కొద్దీ 20 శాతం కాస్తా 40 శాతం అయ్యే అవకాశం ఉందని కూడా తెలిపింది. ఉల్లంఘనలు పదేపదే చేస్తే జరిమానాలు తీవ్రస్థాయిలో ఉంటాయని పేర్కొన్న సొసైటీ.. నీటి వినియోగాన్ని పర్యవేక్షించేందుకు ఓ సెక్యూరిటీగార్డును కూడా నియమిస్తున్నట్టు తెలిపింది. 
 
ఆర్కెస్ట్రా ట్రూప్‌లోని ఓ యువతిపై సామూహిక అత్యాచారం... 
 
జార్కండ్ రాష్ట్రంలో మరో దారుణం జరిగింది. ఇటీవల స్పానిష్ మహిళపై ఏడుగురు కామాంధులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన ఇంకా మరిచిపోకముందే.. తాజాగా మరో దారుణం జరిగింది. ఆర్కెస్ట్రా బృందంలో పాటలు పాడే యువతిపై గ్యాంగ్ రేప్ జరిగింది. శీతలపానీయంలో మత్తుమందు కలిపి ఇచ్చి తనపై ముగ్గురు యువకులు అత్యాచారం చేశారని ఛత్తీస్‌గఢ్‌కు చెందిన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పెళ్లి వేడుకలో ప్రదర్శన ఇవ్వాలంటూ పాలాము జిల్లాకు పిలిచి ఈ దారుణానికి పాల్పడ్డారని ఆరోపించింది.
 
దీనిపై పోలీసులు స్పందిస్తూ, ఛత్తీస్‌గఢ్‌కు చెందిన యువతి ఆర్కెస్ట్రా బృందంలో పాటలు పాడుతుంది. ట్రూప్‌తో కలిసి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు ఇతర రాష్ట్రాలకు కూడా వెళుతుంది. ఈ క్రమంలోనే ఝార్ఖండ్‌కు చెందిన ఆర్కెస్ట్రా బృందం నిర్వాహకుడు గోలు అనే వ్యక్తి ఓ కార్యక్రమం కోసం బాధితురాలిని పిలిచాడు. పెళ్లిలో ప్రోగ్రాం ఉందని, తన ట్రూప్‌కు ఓ లేడీ సింగర్ కావాలని కోరడంతో బాధితురాలు తన సోదరితో కలిసి పాలాము జిల్లాకు వెళ్లింది. తీరా అక్కడికి వెళ్లాక ప్రోగ్రాం రద్దు కావడంతో బాధితురాలితో పాటు ఆమె సోదరికి గోలు తన ఇంట్లో ఆశ్రయం ఇచ్చాడు.
 
చెరో గదిలో వసతి ఏర్పాటు చేసి కూల్ డ్రింక్ ఇచ్చాడు. ఆ కూల్ డ్రింక్ తాగాక తనను మత్తు ఆవరించిందని, అయితే తను మెలకువలోనే ఉన్నానని బాధితురాలు పోలీసులకు తెలిపింది. ఆపై గోలు‌తో పాటు ముగ్గురు యువకులు తనపై అత్యాచారానికి పాల్పడ్డారని, ఆ రోజు రాత్రి పదే పదే రేప్ చేశారని పేర్కొంది. బాధితురాలిని ఆసుపత్రిలో చేర్పించిన పోలీసులు.. కేసు నమోదు చేసుకుని ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. మరో నిందితుడు పరారీలో ఉన్నాడని, అతడి కోసం గాలిస్తున్నామని చెప్పారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దక్షిణ భారతదేశానికి తెలంగాణ ఓ గేట్‌వే : ప్రధాని నరేంద్ర మోడీ