Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

దేశ వ్యాప్తంగా ఏకకాలంలో 17 చోట్ల ఎన్.ఐ.ఏ సోదాలు...

nia agency

ఠాగూర్

, మంగళవారం, 5 మార్చి 2024 (11:52 IST)
జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్‌ఐఏ మంగళవారం దేశ వ్యాప్తంగా 17 చోట్ల ఏకకాలంలో సోదాలు చేపట్టింది. ఓ లష్కరే ఉగ్రవాది బెంగళూరు పరప్పణ అగ్రహార జైలులోని ఖైదీలకు ఉగ్రవాద భావజాలం బోధిస్తున్నట్టు నమోదైన కేసు దర్యాప్తులో భాగంగా వీటిని చేపట్టినట్లు తెలుస్తోంది. అనుమానితులకు సంబంధించిన ప్రదేశాలున్న తమిళనాడు, కర్ణాటక సహా మరో ఐదు రాష్ట్రాల్లో ఇవి జరుగుతున్నాయి.
 
జులై 2023 బెంగళూరు సెంట్రల్‌ క్రైం బ్రాంచ్‌ ఓ ఇంట్లో సమావేశమైన ఐదుగురు వ్యక్తులను అరెస్టు చేసింది. వీరందరూ లష్కరే తోయిబా ఉగ్రవాది నజీర్‌ భావజాలంతో ప్రభావితమైనవారిగా గుర్తించారు. అప్పట్లో నిందితుల నుంచి మందుగుండు, ఆయుధాలు, గ్రనేడ్లు, వాకీటాకీలు స్వాధీనం చేసుకొన్నారు. దీంతో కేసును జాతీయ దర్యాప్తు సంస్థకు బదిలీ చేశారు. నజీర్‌ ప్రస్తుతం జీవితఖైదు అనుభవిస్తున్నాడు. గతేడాది కూడా జాతీయ దర్యాప్తు సంస్థ తనిఖీలు నిర్వహించింది. 
 
ఈ నెల మొదట్లో బెంగళూరు రామేశ్వరం కెఫేలో పేలుడు ఘటన చోటుచేసుకొన్న విషయం తెలిసిందే. ఆ కేసును కూడా నిన్న జాతీయ దర్యాప్తు సంస్థకు అప్పగించారు. ఆ మర్నాడే 2023 నాటి ఉగ్ర కుట్ర కేసుకు సంబంధించిన తనిఖీలు చోటు చేసుకోవడం గమనార్హం. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చంద్రయాన్-3 ప్రయోగం.. అదే రోజు క్యాన్సర్ వున్నట్లు తేలింది..?